Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆమెకు అబార్షన్ చేయండి.. వైద్యులకు ఢిల్లీ హైకోర్టు ఆదేశం

Webdunia
సోమవారం, 11 జనవరి 2021 (16:14 IST)
కడుపులో పెరుగుతున్న బిడ్డకు  పుర్రెభాగంలో ఎముకల సమస్య ఉన్నట్టు వైద్య పరీక్షల్లో తేలింది. దీంతో ఆమెకు అబార్షన్ చేయాల్సిందిగా వైద్యులను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఢిల్లీకి చెందిన ఓ మహిళ గర్భందాల్చింది. కానీ, 28 వారాల తర్వాత అబార్షన్ చేయించుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఆమె ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. దీనికి కారణం... అల్ట్రాసౌండ్ స్కానింగులో తన గర్భంలో ఉన్న పిండం పుర్రెభాగంలో ఎముకల ఎదుగుదల సమస్య తలెత్తినట్లు డాక్టర్లు చెప్పారని, గర్భిణీ కోర్టుకు సంబంధింత రిపోర్టులను అందజేశారు. దీన్ని అనెన్సుఫాలీ వ్యాధిగా పిలుస్తారు.
 
అయితే, మహిళా పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు ఎయిమ్స్ డాక్టర్ల ఆధ్వర్యంలో మరోసారి పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షల్లో అనెన్సుఫాలీ సమస్య ఉన్నట్లు ఎయిమ్స్ డాక్టర్లు నిర్ధారించారు. దీంతో బాధితురాలి అబార్షన్‌కు ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ డీఎన్ పటేల్, జస్టీస్ జ్యోతీ సింగ్‌ల బెంచ్ అనుమతిస్తూ తీర్పు వెల్లడించింది. విచారణ చేపట్టిన కోర్ట్ సైతం ఆమె అబార్షన్ చేయించుకోవడమే ఉత్తమమని సలహా ఇచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ramcharan: పెద్ది లో కొత్త లుక్ లో రామ్ చరణ్ ను చూపించనున్న స్టైలిస్ట్ ఆలీం హకీం

బరాబర్ ప్రేమిస్తా’ నుంచి పాట విడుదల చేసిన బన్నీ వాస్

లిటిల్ హార్ట్స్ మూవీలో లైవ్ లీగా చూపించారు : అనిల్ రావిపూడి

రిషబ్ శెట్టి మూవీ కాంతార చాప్టర్ 1 నుంచి గుల్షన్ దేవయ్య లుక్

కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో అర్జున్ చక్రవర్తి లాంటి సినిమా రాలేదు : నిర్మాత శ్రీని గుబ్బల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments