ఢిల్లీ పేలుడు కేసులో దర్యాప్తును ముమ్మరం

Webdunia
శనివారం, 30 జనవరి 2021 (11:44 IST)
ఢిల్లీలోని ఇజ్రాయిల్‌ రాయబార కార్యాలయానికి సమీపంలో జరిగిన పేలుడు కేసులో దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ కేసును జాతీయ దర్యాప్తు బృందం (ఎన్‌ఐఎ)కి అప్పగించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.

ఈ పేలుడులో ఇరాన్‌తో సంబంధాలున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని ఢిల్లీ పోలీసులు తెలిపారు. పేలుడు ప్రాంతంలో లభించిన ఎన్వలప్‌తో ఇరాన్‌తో సంబంధాలు ఉన్నట్లు తేలిందని, వారి లక్ష్యం భారత్‌లోని ఇజ్రాయిల్‌ సంస్థలని పోలీసులు తెలిపారు.

దీంతో ఇజ్రాయిల్‌తో సంబంధాలు ఉన్న అన్ని ప్రదేశాలలో భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్లు అధికారులు వెల్లడించారు. తక్కువ తీవ్రత కలిగిన పేలుడు పదార్థాలను వినియోగించినట్లు సమాచారం.

గత నెల భారత్‌కు వచ్చిన ఇరానీయులను గుర్తించేందుకు జాతీయ దర్యాప్తు సంస్థలైన ఐబి, ఇమ్మిగ్రేషన్‌ సహా కేంద్ర సంస్థల సహాయాన్ని తీసుకుంటున్నట్లు పోలీసులు వెల్లడించారు.

ఈ నేపథ్యంలో.. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా రెండు రోజుల పశ్చిమబెంగాల్‌ పర్యటనను రద్దు చేసుకున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments