Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రాణాలు తీసుకుంటున్న బీజేపీ నేతలు.. ఎందుకు?

Webdunia
మంగళవారం, 30 మార్చి 2021 (10:51 IST)
ఇటీవలి కాలంలో భారతీయ జనతా పార్టీకి చెందిన నేతలు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. మొన్నటికిమొన్న బీజేపీ ఎంపీ రాం స్వరూప్ శర్మ ఆత్మహత్య చేసుకున్నారు. ఇపుడు మరో సీనియర్ నేత ప్రాణాలు తీసుకున్నారు. ఈ వరుస ఘటనలు కలకలం రేపుతున్నాయి. 
 
దక్షిణ ఢిల్లీ బీజేపీ మాజీ ఉపాధ్యక్షుడైన జీఎస్ బావా తన ఇంటి సమీపంలోని పార్క్‌లో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ సమస్యల వల్లే ఆయన ఈ తీవ్ర నిర్ణయం తీసుకుని ఉండొచ్చని తెలుస్తుండగా, ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
 
కాగా, 58 ఏళ్ల బావా పశ్చిమ ఢిల్లీలోని ఫతేనగర్‌లో నివసిస్తున్నారు. సోమవారం సాయంత్రం ఆరు గంటల సమయంలో పార్కులోని చెట్టుకు విగతజీవిగా వేలాడుతుండడాన్ని గుర్తించిన కొందరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. 
 
వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు ఆయనను బీజేపీ నేత జీఎస్ బావాగా గుర్తించారు. ఆయన వద్ద నుంచి ఎలాంటి సూసైడ్ నోట్ లభ్యం కాలేదని, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments