జనవరి 7, మధ్యాహ్నం 2 గంటలు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్

ఠాగూర్
మంగళవారం, 7 జనవరి 2025 (12:46 IST)
కొత్త యేడాదిలో ఎన్నికల సందడి మొదలైంది. దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి నోటిఫికేషన్ జారీచేయనుంది. 
 
మొత్తం 70 శాసనసభ స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీకి ఈ యేడాది ఫిబ్రవరి 23తో గడువు ముగియనుంది. ఆలోపే ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అంటే వచ్చే నెల మొదటి వారంలో పోలింగ్ జరిగే అవకాశాలున్నాయి. గతంలో 2020లో ఫిబ్రవరి 8వ తేదీన ఓటింగ్ నిర్వహించి అదే నెల 11వ తేదీన ఫలితాలను ప్రకటించారు. సాధారణంగా ఇక్కడ ఒకే విడతలో పోలింగ్ నిర్వహిస్తారు.
 
ప్రస్తుత అసెంబ్లీలో అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి 62 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. భారతీయ జనతా పార్టీ సంఖ్యాబలం ఎనిమిదిగా ఉంది. పదేళ్ల పాటు అధికారంలో ఉన్న ఆప్.. వచ్చే ఎన్నికల్లో మరోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తోంది. అటు ఆమ్ ఆద్మీ పార్టీని అడ్డుకుని కేంద్ర పాలిత ప్రాంతంలో పాగా వేయాలని బీజేపీ వ్యూహరచన చేస్తోంది. ఇప్పటికే ఆప్ 70 మంది అభ్యర్థులను ప్రకటించగా. కాంగ్రెస్, బీజేపీ కూడా కొన్ని స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Balakrishna: అఖండ 2 కోసం ముంబై చేరిన బాలకృష్ణ, బోయపాటిశ్రీను

ఏఐ విప్లవం ముందు విద్య చచ్చిపోయింది : రాంగోపాల్ వర్మ

గ్రాండ్ గ్లోబ్ ట్రాటర్‌కు ఆ వయసు వారికి ఎంట్రీ లేదు : రాజమౌళి

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments