Webdunia - Bharat's app for daily news and videos

Install App

గమ్యస్థానానికి ఆలస్యంగా చేరిన రైలు... నీట్ పరీక్షకు దూరమైన విద్యార్థులు

Webdunia
ఆదివారం, 5 మే 2019 (16:22 IST)
దేశ వ్యాప్తంగా జాతీయ ప్రవేశ అర్హత పరీక్ష (నీట్) ఆదివారం జరిగింది. అయితే, 200 పైచిలుకు మంది విద్యార్థులు ఈ పరీక్ష రాసే అవకాశాన్ని కోల్పోయారు. దీనికి కారణం వారు ప్రయాణించిన రైలు గమ్యస్థానానికి ఆలస్యంగా చేరుకోవడమే. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బళ్ళారి, హుబ్లి పరిసర ప్రాంతాలకు చెందిన సుమారుగా 200 పైచిలుకు మంది విద్యార్థులకు నీట్ పరీక్షా కేంద్రాన్ని బెంగుళూరులో కేటాయించారు. ఆదివారం ఉదయం 7 గంటలకు నగారానికి చేరే హంపి ఎక్స్‌ప్రెస్‌ను వీరు ఎక్కారు. ఈ రైలు నిర్ణీత సమయం ఉదయం 7 గంటలకు రావాల్సి ఉండగా, అది మధ్యాహ్నం 2.30 గంటలకు చేరుకుంది. అంటే దాదాపు 7.30 గంటలు ఆలస్యంగా బెంగళూరు రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. 
 
ఆ తర్వాత విద్యార్థులంతా పరీక్షా కేంద్రమైన దయానంద్‌ సాగర్‌ కాలేజీకి వీరు చేరుకోవాల్సి ఉంది. పరీక్షా కేంద్రానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించరు. దీంతో 500 మంది విద్యార్థులు నీట్ పరీక్షను రాయలేకపోయారు. దీంతో వీరంతా సోషల్ మీడియా ద్వారా కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖామంత్రి ప్రకాష్ జవదేకర్‌కు విజ్ఞప్తి చేశారు. కానీ, ఆయన కూడా స్పదించలేదు. 
 
ఈ వ్యవహారంపై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించారు. రైలు ఆలస్యంపై ఆయన మండిపడ్డారు. ఇతర నేతల విజయాలను తమ గొప్పలుగా చెప్పుకునే ప్రధాని నరేంద్ర మోడీగారూ... మీ సహచర కేబినెట్‌ మంత్రుల వైఫల్యాలకు బాధ్యత తీసుకుంటారా అని నిలదీశారు. రైళ్ళు సకాలంలో చేరకపోవడంతో తమ రాష్ట్రంలో వేల మంది విద్యార్థులు నీట్‌ రాయలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. పరీక్ష రాయలేకపోయిన విద్యార్థులకు మరోసారి పరీక్ష నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు రైల్వే మంత్రి పియూష్‌ గోయల్‌ చర్యలు తీసుకోవాలన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గ్యాస్ సమస్య కారణంగానే బన్నీ హాజరుకాలేదు : అల్లు అరవింద్

Casting Couch: స్టార్ హీరో నుంచి ఆఫర్ వచ్చింది.. డ్రెస్సా-బికినీయా అనేది నా నిర్ణయం

అసలు మీ సమస్య ఏంటి? జర్నలిస్టుపై మండిపడిన పూజాహెగ్డే

పూజా హెగ్డేలో ప్రేమలో పడింది.. ఘాటుగా లిప్ కిస్.. ట్రెండింగ్‌లో బుట్టబొమ్మ (video)

సెల్ఫీ కోసం వచ్చిన మహిళా ఫ్యాన్స్‌కు ముద్దు పెట్టిన ఉదిత్.. ఏకంగా లిప్ లాక్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ తొలి పీడియాట్రిక్ బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్‌

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం: క్యాన్సర్ ఛాంపియన్‌ల కోసం హెచ్‌సిజి క్యూరీ క్యాన్సర్ సెంటర్ పికిల్‌బాల్ టోర్నమెంట్‌

టీకన్సల్ట్ ద్వారా సమగ్ర ఆరోగ్య సంరక్షణ: మంతెన సత్యనారాయణ రాజు ఆరోగ్య ప్రసంగం

స్ట్రాబెర్రీలు తింటే 7 ఆరోగ్య ప్రయోజనాలు

ఆడోళ్లకు కూడా కండోమ్స్ వచ్చేశాయి.. ఎలా వాడాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments