Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా టీకా పంపిణీ ప్రారంభమైతే సీఏఏ చట్టం సంగతి చూస్తాం : అమిత్ షా

Webdunia
మంగళవారం, 22 డిశెంబరు 2020 (08:45 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం పౌరసత్వ చట్టానికి సవరణలు చేపట్టింది. దీనికి పౌరసత్వ సవరణ చట్టం అనే పేరు పెట్టారు. అయితే ఇది తీవ్ర వివాదాస్పదమైంది. దేశ వ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. ఈ వివాదాస్పద చట్టాన్ని ముస్లిం సంస్థలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అదేసమయంలో ప్రపంచాన్ని కరోనా వైరస్ కబళించింది. దీంతో ఈ పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) మరుగునపడిపోయింది. 
 
దీనిపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) కరోనా కారణంగా మరుగున పడిందని, దేశంలో టీకా పంపిణీ ఒకసారి మొదలు కాగానే దాని సంగతి చూస్తామని తెలిపారు. 
 
ఈ చట్టానికి సంబంధించిన నియమాలను రూపొందించడం ఓ భారీ ప్రక్రియ అని, ప్రస్తుత పరిస్థితుల్లో దానిని కొనసాగించడం కష్టమన్నారు. వ్యాక్సిన్ పంపిణీ అందుబాటులోకి వచ్చి కరోనాను ఖతం చేసిన తర్వాత మాత్రమే సీఏఏపై దృష్టి సారిస్తామన్నారు.
 
అదేసమయంలో వెస్ట్ బెంగాల్ పర్యటనకు వెళ్లిన తమ పార్టీ అధినేత జేపీ నడ్డా కాన్వాయ్‌పై తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అరాచక శక్తులు దాడి చేయడాన్ని అమిత్ షా తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనకు మమత ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. 
 
బెంగాల్ కేడర్‌కు చెందిన ముగ్గురు ఐపీఎస్ అధికారులను డిప్యుటేషన్‌పై పంపించాలన్న కేంద్రం లేఖను మమత తీవ్రంగా తప్పుబట్టడంపై స్పందించిన షా, ఐపీఎస్ అధికారులను ఆదేశించే అధికారం కేంద్రానికి ఉందన్నారు. ఈ విషయంలో రాష్ట్రానికి లేఖ రాయడం చట్టబద్దమేనని షా తేల్చి చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్వరలోనే తల్లి కాబోతున్న పవన్ హీరోయిన్ పార్వతీ మెల్టన్

బాలీవుడ్ నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ అలా మోసం చేశారా?

Bellamkonda: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధాపురి లో అమ్మాయి అదృశ్యం వెనుక వుంది ఎవరు...

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

సోనీ పిక్చర్స్ సిసు: రోడ్ టు రివెంజ్ నాలుగు భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం