Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైళ్ల ఆహారంలో నాణ్యత గోవిందా: వెజ్ బిర్యానీలో బల్లి.. సురేష్ ప్రభుకు ట్వీట్..!

రైళ్లలో ఆహారం నాణ్యత లోపించిందని పార్లమెంట్‌లో కాగ్ తన నివేదిక ద్వారా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనకు సాక్ష్యంగా.. రైళ్లలో ప్రయాణీకులకు ఇచ్చే వెజ్ బిర్యానీలో బల్లి కనిపించింది. వివరాల్లోకి వెళి

Webdunia
బుధవారం, 26 జులై 2017 (11:23 IST)
రైళ్లలో ఆహారం నాణ్యత లోపించిందని పార్లమెంట్‌లో కాగ్ తన నివేదిక ద్వారా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనకు సాక్ష్యంగా.. రైళ్లలో ప్రయాణీకులకు ఇచ్చే వెజ్ బిర్యానీలో బల్లి కనిపించింది. వివరాల్లోకి వెళితే.. జార్ఖండ్ నుంచి ఉత్తరప్రదేశ్‌కు‌ ఓ భక్తుల బృందం పూర్వ్‌ఎక్స్ ప్రెస్‌లో ప్రయాణిస్తున్నారు. వీరు వెజ్ బిర్యానీని ఆర్డర్‌చేసి తినడం ప్రారంభించారు.
 
ఈ నేఫథ్యంలో ట్రైన్ పాట్నా సమీపానికి చేరుకుంది. ఈ సమయంలో వారికి వెజ్ బిర్యానీలో బల్లి కనిపించింది. దీనిని తిన్న ఒక వ్యక్తి అనారోగ్యం పాలయ్యాడు. ఈ విషయమై భక్త బృదం రైల్వే సిబ్బందికి ఫిర్యాదు చేసింది. వారు ఏమాత్రం పట్టించుకోలేరు. దీంతో భక్తులు కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభుకు ట్విట్టర్ ద్వారా సమాచారం అందించారు. ఈ ట్వీట్‌‌కు స్పందన లభించింది. రైలు యూపీలోని మొగల్ సరాయ్ చేరుకోగానే రైల్వే అధికారులు బాధితునికి వైద్యం చేయించారు. 
 
ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు సీనియర్‌ రైల్వే అధికారి కిశోర్‌కుమార్‌ వెల్లడించారు. ఈ ఘటనకు చింతిస్తున్నామని.. విచారణ అనంతరం నివేదికను రైల్వే శాఖ మంత్రికి అందజేయనున్నట్లు చెప్పారు. కాగా రైళ్లలోని ఆహార పదార్థాల్లో నాణ్యత ఉండడం లేదని, రైల్వేలో స్వచ్ఛత, పరిశుభ్రత కనిపించడం లేదు అని కాగ్ పేర్కొంది. డస్ట్ బిన్ లు మచ్చుకైనా లేవని, రైళ్లలో అపరిశుభ్రమైన నీళ్లతో ఆహారం వండుతున్నారని కాగ్ పేర్కొన్న సంగతి తెలిసిందే.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments