Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాలూ ప్రసాద్ యాదవ్‌కు పునర్జన్మను ప్రసాదించనున్న కుమార్తె?

Webdunia
గురువారం, 10 నవంబరు 2022 (12:31 IST)
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పునర్జన్మ పొందనున్నారు. గత కొంతకాలంగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న ఆయనకు కిడ్నీ మార్పిడి చికిత్సను వైద్యులు సూచించారు. దీంతో కిడ్నీ దానం చేసేందుకు ఆయన రెండో కుమార్తె రోహిణి ముందుకు వచ్చారు. అన్నీ అనుకూలిస్తే ఈ నెలాఖరులో లాలూకు కిడ్నీ మార్పిడి చికిత్స సింగపూర్‌లో జరుగుతుంది. 
 
లాలూ ప్రసాద్ యాదవ్ సింగపూర్ పర్యటనకు వెళ్ళిన సమయంలో అక్కడ వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఆ సమయంలో వైద్యులు కిడ్నీ మార్పిడి చికిత్స చేయించుకుంటే ఫలితం ఉంటుందని వైద్యులు సూచించారు. అలా చేస్తే లాలూను మరికొంతకాలం ప్రాణాలతో కాపాడుకోవచ్చని చెప్పినట్టు సమాచారం.
 
దీంతో లాలూ రెండో కుమార్తె రోహిణి తన కిడ్నీ ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. కుమార్తె కిడ్నీ దానం చేసేందుకు లాలూ ప్రసాద్ అంగీకరించలేదు. కానీ, కుటుంబ సభ్యుల నుంచి కిడ్నీ తీసుకుని మార్పిడి చేయడం వల్ల అధిక సక్సెస్ రేటు ఉంటుందంటూ రోహిణి తన తండ్రిని ఒప్పించారు.
 
ఇదే జరిగితే ఈ నెల 220-24 తేదీల మధ్య లాలూ ప్రసాద్ యాదవ్ సింగపూర్‌కు వెళ్లనున్నారు. ఆ సమయంలోనే అక్కడ ఆయనకు కిడ్నీ మార్పిడి చికిత్స చేసే అవకాశం ఉంది. కాగా, లాలూ గత కొన్ని నెలలుగా ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏమీ ఇవ్వలేనన్నారు, ఐతే ఈసారికి ఫ్రీ అన్నాను: నటి ప్రియాంకా జవల్కర్

Pawan: వేసవిలో విడుదలకు సిద్ధమవుతోన్న పవన్ కళ్యాణ్ చిత్రం హరి హర వీరమల్లు

Vishnu: విష్ణు వల్లే గొడవలు మొదలయ్యాయి - కన్నప్ప వర్సెస్ భైరవం : మంచు మనోజ్

ప్రదీప్ మాచిరాజు చిత్రం అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి రివ్యూ

రాజేంద్ర ప్రసాద్ అన్నయ్య షష్టి పూర్తి చూడండి, బావుంటుంది : రవితేజ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments