Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్తి కోసం మామను, భర్తను చితక్కొట్టిన భార్య... రౌడీ షీటర్‌తో కలిసి...

Webdunia
గురువారం, 14 మార్చి 2019 (10:52 IST)
కర్ణాటక రాష్ట్రంలో ఓ వివాహిత తన ప్రియుడైన రౌడీ షీటర్‌తో కలిసి దివ్యాంగుడైన భర్త, అత్తమామలపై దాడి చేసింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన వారంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆస్తి తన పేరుమీద రాయాలని ఆమె డిమాండ్ చేసింది. దీనికి అంగీకరించక పోవడంతో తన ప్రియుడైన రౌడీషీటర్‌తో కలిసి ఈ దాడికి పాల్పడింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కేజీహళ్లి ప్రాంతానికి చెందిన గులాబ్‌జాన్‌ అనే వ్యక్తి కుమారుడికి కొద్ది సంవత్సరాల క్రితం అలిస్మా భాను అనే మహిళతో వివాహమైంది. అయితే అదే ప్రాంతానికి చెందిన సమీర్‌ అనే రౌడీషీటర్‌తో అలిస్మాకు వివాహేతర సంబంధం ఏర్పడింది. దీంతో ఆస్తి మొత్తం తమ పేరుపై మార్చాలంటూ మామ గులాబ్‌జాన్‌తో పాటు దివ్యాంగుడైన భర్తపై ఒత్తిడి తెచ్చింది. కానీ అలిస్మా ఒత్తిడికి లొంగలేదు. 
 
దీంతో ఆగ్రహించిన అలిస్మా తన ప్రియుడైన రౌడీ షీటర్ సమీర్‌తో కలిసి దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన గులాబ్‌జాన్ పోలీసుకు ఫిర్యాదు చేసినా వారు ఏమాత్రం పట్టించుకోలేదు. పైగా, గులాబ్‌జాన్‌ సీసీ కెమెరాల ఫుటేజ్‌లతో మీడియాను ఆశ్రయించడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. ఇంత జరిగినా పోలీసులు అలిస్మా, రౌడీషీటర్‌ సమీర్‌పై కేసు నమోదు చేసుకోకపోవడం విమర్శలు, పలు అనుమానాలకు తావిస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments