Webdunia - Bharat's app for daily news and videos

Install App

దివ్యాంగ బాలికపై బంధువు అత్యాచారం

Webdunia
గురువారం, 14 మార్చి 2019 (10:03 IST)
బంధువు అని నమ్మి సాయం అడిగినందుకు ఆ మానవమృగం బాలిక శీలంపై కాటేశాడు. 13 యేళ్ళ దివ్యాంగ బాలికపై బంధువు అత్యాచారం జరిపాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా నకరికల్లు మండలం చల్లగుండ్ల గ్రామంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ గ్రామానికి చెందిన 13 యేళ్ళ దివ్వాంగ బాలిక ప్రభుత్వ హాస్టల్‌లో ఉంటూ ఎనిమిదో తరగతి చదువుకుంటోంది. ఆరోగ్యం బాగోలేకపోవడంతో శనివారం ఇంటికి వచ్చింది. 
 
సోమవారం నుంచి స్కూలు కావడంతో తన ఇంటి పక్కనే ఉండే వరుసకు మామ అయ్యే బొక్కా మరియదాసు అలియాస్ కోటేశ్వర రావుతో ఆ బాలికను హాస్టల్‌కు పంపించింది. కానీ, ఆ బాలికపై కన్నేసిన ఆ కామాంధుడు హాస్టల్‌కు తీసుకెళ్లకుండా నకరికల్లు శివారు ప్రాంతమైన ఎన్నెస్సీ కాలువ కట్ట వద్దకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
ఆ తర్వాత ఆ బాలిక తనకు జరిగిన అన్యాయాన్ని తోటి స్నేహితురాళ్ళకు చెప్పింది. వారు బాలిక బంధువులకు సమాచారం చేరవేయగా, వారంతా కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడిని అరెస్టు చేసి పోక్సో చట్టాన్ని ప్రయోగించారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం గుంటూరు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

దేవిక అండ్ డానీ వంటి వెబ్ సిరీస్ చేయ‌టం నా అదృష్టం : హీరోయిన్ రీతూవ‌ర్మ‌

పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" చిత్రం మళ్లీ వాయిదానా?

Tarun Bhaskar: నాన్న కి కో వస్తే కామన్ గా తిట్టే పదం బద్మాష్ : తరుణ్ భాస్కర్

Rana: నాయుడు కుటుంబం ఏ ప‌నిని అసంపూర్తిగా చేయ‌దు అనేదే రానా నాయుడు సీజ‌న్‌2

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

తర్వాతి కథనం
Show comments