Webdunia - Bharat's app for daily news and videos

Install App

గూడ్సు రైలును ఢీకొన్న మైసూర్ - దర్బంగా ఎక్స్‌ప్రెస్... మంటల్లో 2 బోగీలు..

ఠాగూర్
శుక్రవారం, 11 అక్టోబరు 2024 (21:47 IST)
తమిళనాడు రాష్ట్రంలోని తిరువళ్లూరు జిల్లా కవరైపేటలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. మైసూరు నుంచి దర్బంగాకు వెళుతున్న (12578) ఎక్స్‌ప్రెస్ రైలు... పట్టాలపై ఆగివున్న గూడ్సు రైలును ఢీకొట్టింది. దీంతో రెండు బోగీల్లో మంటలు చెలరేగాయి. మైసూర్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన ఆరు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం వివరాలు తెలియాల్సివుంది. 
 
తిరువళ్లూరు సమీపంలోని కావరైపేట వద్ద ఆగి ఉన్న గూడ్సు రైలును ఎక్స్‌ప్రెస్‌ రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో రెండు బోగీల్లో మంటలు చెలరేగినట్లు సమాచారం. మైసూరు - దర్భంగా మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్‌ పట్టాలపై ఆగివున్న సరకు రవాణా రైలును అతి వేగంతో వచ్చిన ఎక్స్‌ప్రెస్ వెనుక నుంచి వచ్చి ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
ఈ ఘటనలో పలు బోగీలు పట్టాలు తప్పగా.. రెండు బోగీల్లో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు, సహాయ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపడుతున్నారు. అయితే ఈ ప్రమాదంలో అనేక మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడినట్టు సమాచారం. మృతులు కూడా ఉండే అవకాశం ఉందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ నటులు అమ్ముడుపోయారు - ప్రకాష్ రాజ్ కామెంట్స్

మండాడి నుండి సూరి, సుహాస్ ఫస్ట్ లుక్ విడుదల

రిహాబిలిటేషన్ సెంటర్‌ కు వెళ్ళిన అల్లు అరవింద్, బన్నీ వాసు

Mrunal Thakur And Sumanth: మృణాల్ ఠాకూర్ ప్రేమలో పడిన సుమంత్..? త్వరలోనే పెళ్లి..?

Samantha: శుభం తో నిర్మాతగా మారడానికి కారణం అదే : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

తర్వాతి కథనం
Show comments