Webdunia - Bharat's app for daily news and videos

Install App

తప్పిపోయిన కోడలు ఇంటికి రావాలనీ... నాలుక కోసుకున్న అత్త.. ఎక్కడ?

Webdunia
మంగళవారం, 18 ఆగస్టు 2020 (16:52 IST)
సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందినప్పటికీ గ్రామాల్లో మాత్రం మూఢనమ్మకాలు మాత్రం ఇంకా తొలగిపోలేదు. ఫలితంగా అనేక మంది మహిళలు తమ కోర్కెలు తీర్చుకునేందుకు వివిధ రకాలుగా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి వారిలో ఓ మహిళ.. ఇంటి నుంచి తప్పిపోయిన తమ కోడలు సురక్షితంగా ఇటికి రావాలని కోరుకుంటూ తన నాలుకను కోసుకుంది. ఈ ఘటన జార్ఖండ్ రాష్ట్రంలో సెరైకెలా - ఖర్సావన్ జిల్లాలోని ఎన్‌ఐటీ క్యాంపస్‌లో ఆదివారం జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఎన్‌ఐటీ క్యాంపస్‌లో ఎన్‌ఐటీ క్యాంపస్‌కు చెందిన లక్ష్మీ నిరాలా అనే మహిళ కోడలైన జ్యోతి ఈ నెల 14వ తేదీన తన బిడ్డతో కలిసి తప్పిపోయింది. అప్పటి నుంచి శివుడి గుడి ముందు కూర్చొని లక్ష్మీ పూజలు చేస్తూ ప్రార్థించసాగింది. 
 
తన కోడలు, మనువడు సురక్షితం ఇంటికి తిరిగి రావాలని కోరుకుంటూ తన నాలుకను కత్తిరించి, శివుడికి నైవేద్యంగా సమర్పించింది. ఇలా చేస్తే కోడలు తిరిగి వస్తుందని ఎవరో చెప్పుడంతో లక్ష్మీ అలా చేసింది. ఈ విషయాన్ని ఆమె భర్త నందూలాల్‌ నిరాల వెల్లడించారు. 
 
నాలుక కత్తిరించుకున్న అనంతరం రక్తస్రావం అవుతున్నప్పటికీ ఆమె ఆస్పత్రికి వెళ్లడానికి నిరాకరించారు. ఇరుగుపొరుగు వాళ్లు నచ్చజెప్పి ఆమెను ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, నాలుక పూర్తిగా తెగడంతో మాట్లాడలేకపోతున్నారని వైద్యులు పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments