Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమికుడితో పారిపోయిందని సొంత కూతుర్ని నరికేసిన తండ్రి

Webdunia
సోమవారం, 23 అక్టోబరు 2023 (17:08 IST)
ప్రేమికుడితో కలిసి పారిపోయిందనే కోపంతో ఓ తండ్రి తన కుమార్తెను పొట్టనబెట్టుకున్నాడు. ప్రేమ కారణంగా పారిపోయిందని.. సొంత కూతురిని కొడవలితో అతి కిరాతకంగా నరికి చంపిన అమానవీయ ఘటన బెంగళూరు నగరంలో కలకలం రేపింది. 
 
వివరాల్లోకి వెళితే.. బెంగళూరులోని పరప్ప అగ్రహార పోలీస్ స్టేషన్ పరిధిలో మైసూరులోని హెచ్‌డీ కోటేకు చెందిన పల్లవి (17) అనే యువతి దారుణ హత్యకు గురైంది. పల్లవి తండ్రి గణేష్ (50)ను బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 
 
కూతురు పల్లవిని హత్య చేసి ముగ్గురు కుటుంబ సభ్యుల మీద కొడవలితో దాడి చేసిన గణేష్ నేరుగా పరప్ప అగ్రహార పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. నిందితుడు గణేష్‌ను అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించామని సోమవారం పోలీసు అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజ్ తరుణ్ - లావణ్య కేసులో సరికొత్త ట్విస్ట్.. సంచలన వీడియో రిలీజ్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

పెళ్లంటూ చేసుకుంటే విడాకులు తీసుకోకూడదు.. జీవితాంతం వుండాలి: త్రిష

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments