Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిగ్నల్ లైట్‌కు బురద పూసి రైలు దోపిడీకి యత్నం!!

ఠాగూర్
ఆదివారం, 19 మే 2024 (09:25 IST)
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కొందరు దొంగలు రైలు దోపిడీకి యత్నించారు. సిగ్నల్ లైటుకు బురదపూసి రైలును ఆపేసి ఈ దోపిడీకి పాల్పడ్డారు. దుండగులు సిగ్నల్‌కు బురద పూయడంతో పాటలీపుత్ర ఎక్స్‌ప్రెస్, గోరఖ్‌పూర్ - చండీగఢ్ రైళ్లు నిలిచిపోయాయి. ఆ తర్వాత రైలులోకి ఎక్కిన దుండగులు.. ప్రయాణికులు వస్తువులు, నగల చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటనపై రైల్వే పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 
 
రైల్వే పోలీసులు, ప్రయాణికులు వెల్లడించిన వివరాల మేరకు.. మొరాబాద్ - సహారన్ పూర్ రైల్వే డివిజన్ లక్సర్ రైల్వే స్టషన్ సమీపంలో ఉన్న రైలు సిగ్నల్‌కు కొందరు దుండగులు బురద పూశారు. సిగ్నల్ కనిపించకపోవడంతో పాటలీపుత్ర, గోరఖ్‌పూర్ - చండీగఢ్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు నిలిచిపోయాయి. ఆ తర్వాత ప్రయాణికుల వస్తువులు, నగదును దోపిడీ చేసేందుకు యత్నించారు. 
 
అయితే, ప్రయాణికులంతా కలిసి తిరగబడటంతో వారు పరారయ్యాయి. ఈ లోపు లోకో పైలెట్ కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించారు. లక్సర్ సీఆర్పీఎఫ్ ఇన్‌చార్జ్ ఇన్‌స్పెక్టర్ రవి శివాచ్, జీఆర్పీ పోలీస్ స్టేషన్ హెడ్ సంజయ్ శర్మ, జీఆర్పీ ఎస్పీ సరితో డోభాల్ ఘటనా స్థలానికి చేరుకుని దోపిడీ యత్నం తీరు తెన్నులను పరిశీలించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

తర్వాతి కథనం
Show comments