బీభత్సం సృష్టించిన షహీన్ తుఫాను - నీట మునిగిన బెంగుళూరు

Webdunia
సోమవారం, 4 అక్టోబరు 2021 (15:01 IST)
షహీన్ తుఫాను బీభత్సం సృష్టించింది. ఈ తుఫాను కారణంగా కురిసిన భారీ వర్షాల దెబ్బకు కర్నాటక రాజధాని బెంగుళూరు నగరం జలదిగ్బంధంలో చిక్కుకుంది. ముఖ్యంగా, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్​ జామ్​ ఏర్పడి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. 
 
ఈ తుఫాను ప్రభావం కారణంగా కర్ణాటక రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇంకా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం మధ్యాహ్నం నుంచి బెంగళూరు సహా పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లల్లోకి వరద నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. 
 
బెంగుళూరులో భారీ వృక్షాలు నెలకొరిగి ట్రాఫిక్​కు అంతరాయం ఏర్పడింది. నగరంలోని తుముకూర్​ రోడ్​, మైసూర్​ రోడ్​, బళ్లారి రోడ్​, మెజెస్టిక్​, ఛామరాజపేట్​, బసవన్నగుడి, యశ్వంతపుర్​, రాజరాజేశ్వరీ నగర్​, మహదేవపుర, హెబ్బల్​ ప్రాంతాల్లో ట్రాఫిక్​కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 
 
కేఆర్​ పురా, మహదేవపుర, హోస్కెట్​, రాజరాజేశ్వరీ నగర్​లో 90-98 మిల్లీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది. అక్టోబర్​ 6 వరకు బెంగళూరుపై షహీన్​ ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

యాంకర్ శివజ్యోతి ఆధార్ కార్డును టిటిడి బ్లాక్ చేసిందా? (video)

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం నిర్మిస్తున్నతిమ్మరాజుపల్లి టీవీ మూవీ ఫస్ట్ సింగిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

తర్వాతి కథనం
Show comments