Webdunia - Bharat's app for daily news and videos

Install App

ద్యావుడా, దోమ తెరల వెనుకాల కోట్ల రూపాయల కట్టలు, ఎక్కడ?

Webdunia
సోమవారం, 18 నవంబరు 2019 (17:02 IST)
దోమ తెరల తయారీ పేరుతో అక్రమాలకు పాల్పడుతున్న తమిళనాడుకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త శివస్వామి ఇంటిపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. దోమ తెరల మధ్య కోట్ల రూపాయలు నగదు ఉండడాన్ని గమనించి ఆశ్చర్యపోయారు.

దోమ తెరలను విదేశాలకు ఎగుమతి చేస్తూ కోట్ల రూపాయల డబ్బులను ఐటీ రిటర్న్ ఎగవేస్తూ తప్పించుకు తిరుగుతున్న శివస్వామితో పాటు అతన్ని స్నేహితులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు ఐటీ అధికారులు.
 
నిన్న ఉదయం నుంచి జరుగుతున్న ఐటీ సోదాల్లో ఇప్పటివరకు 35 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు ఐటీ అధికారులు. శోభికా కాంప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కరూర్ జిల్లా సెమ్మడై ప్రాంతంలో దోమ తెరల తయారీ పరిశ్రమల ఉంది. ఈ ప్రాంతం నుంచే విదేశాలకు దోమ తెరలు ఎగుమతి చేస్తున్నారు. 
 
ఏడాదికి ఐదు వందల కోట్ల రూపాయలకు పైగా వాణిజ్యం జరుగుతోంది. అయితే గత కొన్ని సంవత్సరాల నుంచి ఐటీ రిటర్న్స్ ఎగవేస్తున్నట్లు అధికారులకు సమాచారం అందింది. దీంతో ఐటీ అధికారులు కరూర్ జిల్లాలోని శివస్వామికి చెందిన నాలుగు కంపెనీలపై ఏకకాలంలో సోదాలు నిర్వహించి కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments