Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆగస్టులో పిల్లలకు కొవిడ్‌ టీకా

Webdunia
బుధవారం, 28 జులై 2021 (03:22 IST)
పిల్లల కొవిడ్‌ వ్యాక్సిన్‌ ఆగస్టులో అందుబాటులోకి వస్తుందని బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ తెలిపారు.

మరోవైపు అహ్మదాబాద్‌కు చెందిన జైడస్‌ క్యాడిలా కంపెనీ తమ మూడు డోసుల కొవిడ్‌ టీకాను 12 ఏళ్లకు పైబడిన వారందరికీ ఇచ్చేందుకు అత్యవసర వినియోగ అనుమతులను కోరుతూ డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ)కు దరఖాస్తు చేసుకుంది.

హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌ 2-18 ఏళ్ల వారందరిపైనా కొవాగ్జిన్‌ను పరీక్షిస్తోంది. ఈ టీకా సెప్టెంబరుకల్లా పిల్లలకు అందుబాటులోకి రావచ్చంటున్నారు.

కాగా, దేశంలో రోజువారీ కరోనా కేసుల తగ్గుదల రేటు నెమ్మదించడం ఆందోళనకరమని కేంద్రం పేర్కొంది. 7 రాష్ట్రాల్లోని 22 జిల్లాల్లో పాజిటివ్‌లు పెరుగుతున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ తెలిపారు. అజాగ్రత్త వహించవద్దని ప్రజలకు సూచించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments