Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో మళ్లీ పెరిగిన కేసులు... హెచ్చుత‌గ్గుల‌తో డైల‌మా!

Webdunia
బుధవారం, 13 అక్టోబరు 2021 (11:26 IST)
దేశంలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. కానీ, త‌ర‌చూ హెచ్చ త‌గ్గుల‌తో డైల‌మా ప‌రిస్థితి కొన‌సాగుతోంది. ముందు రోజు ఏడు నెలల కనిష్ఠానికి తగ్గిన కొత్త కేసులు(14,313) తాజాగా పెరిగి 15 వేలకు చేరాయి. మృతుల సంఖ్య కూడా 200పైనే  నమోదైంది. అయితే క్రియాశీల కేసులు క్రమంగా తగ్గుతూ రెండు లక్షలకు చేరువవుతుండటం ఊరటనిస్తోంది. ఈ మేరకు బుధవారం కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలను వెల్లడించింది.
 
మంగళవారం 13,26,399 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 15,823 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. అంతక్రితం రోజుకంటే 1,500కు పైగా కేసులు పెరిగాయి. నిన్న 22,844 మంది కోలుకున్నారు. మరో 226 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు 3.40 కోట్ల మందికి కరోనా సోకింది. అందులో 3.33 కోట్ల(98.06 శాతం) మంది కోలుకున్నారు. ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య 2,07,653 (0.61 శాతం)గా ఉంది. 4,51,189 (1.33 శాతం)మంది మృత్యు ఒడికి చేరుకున్నారు.
 
కరోనాను కట్టడి చేసేందుకు కేంద్రం టీకా కార్యక్రమాన్ని వేగవంతం చేసింది. నిన్న 50.63 లక్షల మంది టీకా వేయించుకున్నారు. ఇప్పటివరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య  96.43 కోట్ల మార్కును దాటింది. ఇది స‌రికొత్త రికార్డు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇద్దరు డైరెక్టర్లతో హరి హర వీర మల్లు రెండు భాగాలు పూర్తి?

కావ్య కీర్తి సోలో క్యారెక్టర్ గా హలో బేబీ

యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మాణంలో సయారా విడుదలతేదీ ప్రకటన

మంచు విష్ణు పోస్ట్ పై సోషల్ మీడియాలో వైరల్

Krishna Bhagwan: పవన్ కల్యాణ్‌పై కృష్ణ భగవాన్ వ్యాఖ్యలు.. పొగిడారా? లేకుంటే తిట్టారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments