Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడులో ఒకే రోజు 70 ఒమిక్రాన్ కేసులు: 1-8వరకు స్కూల్స్ మూసివేత

Webdunia
శనివారం, 1 జనవరి 2022 (09:30 IST)
తమిళనాడును మరో ఉపద్రవం ముంచేలా ఉంది. ఇప్పటికే భారీ వర్షాలు భయపెడుతుంటే.. శుక్రవారం ఒక్కరోజే అక్కడ 70కి పైగా కొత్త వేరియంట్ కేసులు నమోదు కావడం భయానక పరిస్థితి కల్పించింది. ఒకే రోజు అన్ని కేసులు నమోదు కావడంతో అంతా అప్రమత్తమయ్యారు. తమిళనాడులో ఇప్పటికే ఒమిక్రాన్ కేసుల సంఖ్య 120కి చేరింది. 
 
తాజా పరిస్థితుల నేపథ్యంలో స్టాలిన్‌ ప్రభుత్వం అప్రమత్తమైంది. నేటి నుంచి కఠిన ఆంక్షలు అమలు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ముందుగా ఒకటి నుంచి 8వ తరగతి వరకు స్కూళ్లు మూసేయాలని నిర్ణయించారు. 
 
అలాగే 50 శాతం ఆక్యుపెన్సీతో మాల్స్‌, థియేటర్లు, మెట్రోలు నిర్వహించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ ఆంక్షలను కొత్త ఏడాది ప్రారంభం నుంచి జనవరి 30 వరకు కఠినంగా అమలు చేయాలని స్టాలిన్‌ ప్రభుత్వం నిర్ణయించింది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలకు కూడా సిద్దమైంది. 
 
కేవలం తమిళనాడే కాదు.. అన్ని రాష్ట్రాల్లోనూ ఒమిక్రాన్ భూతం వేగంగా విస్తరిస్తోంది. ప్రస్తుతం మన దేశంలోని ఒమిక్రాన్‌ వేరియంట్‌ ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చినా.. వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య వెయ్యి దాటేసింది

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ టైటిల్ చెన్నై లవ్ స్టోరీ

Nidhhi Agerwal: శింబుతో నిధి అగర్వాల్ ప్రేమాయణం.. పవన్ బ్యూటీ ఏం చెప్పిందంటే?

'హరిహర వీరమల్లు' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎపుడు.. ఎక్కడ?

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments