Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకేసారి నలుగురు పిల్లలకు జన్మనిచ్చిన కరోనా బాధితురాలు

Webdunia
శుక్రవారం, 25 సెప్టెంబరు 2020 (13:31 IST)
ఉత్తరప్రదేశ్‌లో ఒకే కాన్పులో నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది కరోనా బాధితురాలు. ఈ ఘటన గోరఖ్‌పూర్‌ బీఆర్‌డీ మెడికల్‌ కళాశాలలో చోటుచేసుకుంది. నవజాతి శిశువుల్లో ముగ్గురు ఆరోగ్యంగా ఉన్నారని, నాలుగో శిశువుని వెంటిలేటర్‌పై ఉంచినట్లు వైద్యులు వివరించారు. 
 
అలాగే నలుగురికి జన్మనిచ్చిన తల్లి కూడా క్షేమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. అయితే నెలలు నిండకముందే డెలివరీ అయినట్లు వైద్యులు చెప్పారు. నలుగురు చిన్నారులు 900 గ్రాముల నుంచి 1.5 కిలోల వరకు ఉన్నట్లు ఆస్పత్రి వైద్యులు పేర్కొన్నారు.
 
ఇలాంటి కేసులు చాలా అరుదుగా వస్తాయని బీఆర్‌డీ మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపల్‌ గణేష్‌ తెలిపారు. నలుగురు పిల్లల నుంచి శాంపిల్స్‌ సేకరించి కరోనా పరీక్షల కోసం మైక్రో బయోలజీ డిపార్టుమెంట్‌కు పంపినట్లు తెలిపారు. 
 
కాగా, దేవరియా జిల్లాలోని గౌరీ బజార్‌లో ఉంటున్న 26 మహిళ మంగళవారం రాత్రి మెడికల్‌ కాలేజీలోని ట్రామా సెంటర్‌లో కరోనా పరీక్షలు చేయించుకుంది. ఈ పరీక్షల్లో ఆమెకు పాజిటివ్‌ వచ్చింది. మహిళ డెలివరికి ఉండటంతో వైద్య బృందం మెరుగైన చికిత్స అందించారు. బుధవారం నలుగురు పిల్లలకు జన్మనించ్చిందని ఆయన తెలిపారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments