Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భారత్‌లో శాంతించని కరోనా ఉద్రిక్తత, కొత్తగా 86,052 పాజిటివ్ కేసులు

Advertiesment
Covid 19
, శుక్రవారం, 25 సెప్టెంబరు 2020 (12:13 IST)
భారత్‌లో కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. కరోనా మహమ్మరి వ్యాప్తి రోజురోజుకు పెరిగిపోతున్నది. దీనికితోడు వివిద రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతున్నది. దేశంలో కేసుల సంఖ్య 58 లక్షల 18 వేలు దాటింది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 86,052 కొత్త కేసులు నమోదు కాగా 1141 మంది ప్రాణాలు కోల్పోయారు.
 
గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 81,177 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దేశంలో మొత్తం 58,18,571 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 9,70,116 ఉండగా 47,56,164 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇదిలా ఉండగా 92,290 మంది కరోనా వ్యాధితో మరణించారు. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 81.74 శాతంగా ఉంది.
 
దేశంలో మొత్తం నమోదైన కేసులలో 1.59 శాతానికి తగ్గిన మరణాల రేటు. దేశంలో నమోదైన మొత్తం కేసులలో యాక్టివ్ కేసుల శాతం 16.67 శాతంగా ఉంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 14,92,409 కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు జరిపారు. ఇప్పటివరకు దేశంలో 6,89,28,440 కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనావైరస్, విషమంగా మారిన డిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఆరోగ్యం