Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దేశంలో 90 వేలు - తెలంగాణాలో 2 వేలు పాజిటివ్ కేసులు

దేశంలో 90 వేలు - తెలంగాణాలో 2 వేలు పాజిటివ్ కేసులు
, బుధవారం, 23 సెప్టెంబరు 2020 (11:08 IST)
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ఏమాత్రం తగ్గడం లేదు. ఫలితంగా ప్రతి రోజూ వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో 83,347 మందికి కరోనా నిర్ధారణ అయిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 56,46,011కు చేరింది.
 
గ‌త 24 గంట‌ల సమయంలో 1,085 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 90,020కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 45,87,614 మంది కోలుకున్నారు. 9,68,377 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.  
 
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 6,62,79,462 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. మంగళవారం ఒక్కరోజులోనే 9,53,683 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
 
తెలంగాణ‌లో కొవిడ్‌-19 కేసుల విజృంభణ కొన‌సాగుతోంది. తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ బుధవారం వెల్లడించిన వివరాల ప్ర‌కారం.. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 2,296 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 10 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 2,062 మంది కోలుకున్నారు.
 
ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,77,070కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 1,46,135 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 1,062కు చేరింది. ప్రస్తుతం 29,873 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 321, రంగారెడ్డి జిల్లాలో 217 కేసులు నమోదయ్యాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గూగుల్ పే యాప్ నుంచి కొత్త సేవలు.. డెబిట్, క్రెడిట్ కార్డులతో..?