Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలోని పెళ్లి మండపంలో వినూత్న నిరసన.. ఏం చేశారంటే?

Webdunia
మంగళవారం, 24 డిశెంబరు 2019 (12:50 IST)
ఢిల్లీలోని ఓ పెళ్ళి మండపంలో వినూత్న నిరసన చోటుచేసుకుంది. పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌరుల రిజిస్టరుకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరసనలు ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జామియా మిలియా యూనివర్శిటీలో జరిగిన ఆందోళనల్లో పోస్టుగ్రాడ్యుయేట్ విద్యార్థిని అమీనా జకియా చురుకుగా పాల్గొన్నారు. ఆమె తన పెళ్లిలో కూడా ఈ చట్టాలపై నిరసన వ్యక్తం కావాలనుకున్నారు.
 
అందుకు పెళ్లి కుమారుడితోపాటు అతని కుటుంబ సభ్యులను ఒప్పించారు. అనంతరం పెళ్లి వేడుకల్లోనే వధూవరులతోపాటు పెళ్లికి హాజరైన బంధువులు, కుటుంబసభ్యులు, అతిధులు ఈ చట్టాలకు వ్యతిరేకంగా ప్లకార్డులు చేత బట్టి, నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. 
 
పెళ్లి వేడుకలో ప్రముఖ విప్లవ రచయిత హబీబ్ జాలిబ్ రాసిన కవితలను చదువుతూ వధూవరులు నిరసన తెలిపారు. కాగా ఈ కటుంబానికి  రాజకీయాలతో ఎటువంటి సంబంధం లేదు. కేవలం ప్రభుత్వానికి తమ నిరసనను తెలిపేందుకే తాము పెళ్లి వేడుకలో ఈ చట్టానికి వ్యతిరేకంగా ప్లకార్డులు చేతబట్టామని వధువు సోదరి వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments