Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా ఎఫెక్టు.. ఎంపీల జీతాల్లో కోత... ఎంపీ లాండ్స్ నిలిపివేత

Webdunia
సోమవారం, 6 ఏప్రియల్ 2020 (17:28 IST)
కేంద్ర మంత్రివర్గం రెండు అత్యత కీలక నిర్ణయాలు తీసుకుంది. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ అమల్లో వుంది. ఇది ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. 
 
ఈ నేపథ్యంలో కేంద్ర కేబినెట్ రెండు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎంపీల వేతనాల్లో ఏడాది పాటు 30 శాతం కోత విధించాలని, ఎంపీలకు ఇచ్చే నిధుల (ఎంపీ లాడ్స్)ను రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. యేడాది పాటు ఎంపీల వేతనాలు, అలవెన్స్‌లు, పెన్షన్లలో ఈ కోత ఉండేలా ఓ ఆర్డినెన్స్‌ను తెచ్చారు. ఇందుకోసం 1954 చట్టాన్ని సవరించారు. 
 
ఈ విషయాలను కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి జవదేకర్ సోమవారం మీడియాకు వివరించారు. ఎంపీ లాడ్స్  2020-21, 2021-22కు సంబంధించి మొత్తం నిధులు రూ.7900 కోట్లు అని, ఈ మొత్తంతో కన్సాలిడేటెడ్ ఫండ్ రూపంలో ఓ నిధిని ఏర్పాటు చేసి, కరోనా సహాయక చర్యల కోసం ఖర్చు చేస్తామని తెలిపారు. కాగా, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, రాష్ట్రాల గవర్నర్లు తమ వేతనాల్లో 30 శాతం కోతకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments