Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా ఎఫెక్టు.. ఎంపీల జీతాల్లో కోత... ఎంపీ లాండ్స్ నిలిపివేత

Webdunia
సోమవారం, 6 ఏప్రియల్ 2020 (17:28 IST)
కేంద్ర మంత్రివర్గం రెండు అత్యత కీలక నిర్ణయాలు తీసుకుంది. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ అమల్లో వుంది. ఇది ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. 
 
ఈ నేపథ్యంలో కేంద్ర కేబినెట్ రెండు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎంపీల వేతనాల్లో ఏడాది పాటు 30 శాతం కోత విధించాలని, ఎంపీలకు ఇచ్చే నిధుల (ఎంపీ లాడ్స్)ను రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. యేడాది పాటు ఎంపీల వేతనాలు, అలవెన్స్‌లు, పెన్షన్లలో ఈ కోత ఉండేలా ఓ ఆర్డినెన్స్‌ను తెచ్చారు. ఇందుకోసం 1954 చట్టాన్ని సవరించారు. 
 
ఈ విషయాలను కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి జవదేకర్ సోమవారం మీడియాకు వివరించారు. ఎంపీ లాడ్స్  2020-21, 2021-22కు సంబంధించి మొత్తం నిధులు రూ.7900 కోట్లు అని, ఈ మొత్తంతో కన్సాలిడేటెడ్ ఫండ్ రూపంలో ఓ నిధిని ఏర్పాటు చేసి, కరోనా సహాయక చర్యల కోసం ఖర్చు చేస్తామని తెలిపారు. కాగా, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, రాష్ట్రాల గవర్నర్లు తమ వేతనాల్లో 30 శాతం కోతకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments