Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో కరోనా కరాళనృత్యం.. రికార్డు స్థాయిలో 20,903 కేసులు

Webdunia
శుక్రవారం, 3 జులై 2020 (10:24 IST)
భారత్‌లో కరోనా విజృంభిస్తోంది. రోజు రోజుకు కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. దీంతో ప్రజలు వణికిపోతున్నారు. ఈ మహమ్మారి దెబ్బకు ఇప్పటికే అనేకమంది ప్రాణాలు కోల్పోయారు. కాగా, గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో కొత్తగా 20,903 కరోనా కేసులు నమోదయ్యాయి.
 
అలాగే కరోనా కారణంగా 379 మంది మరణించారు. దీంతో ‌భారత్‌‌లో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,25,544కి చేరుకోగా మొత్తం మరణాల సంఖ్య 18,213గా ఉంది. ఇప్పటివరకు మొత్తం నమోదైన పాజిటివ్ కేసుల్లో 2,27,439 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా 3,79,891 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
 
ఇకపోతే, దేశంలో కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తోంది. వైరస్ విజృంభణ మొదలైన తొలి రోజు నుంచి రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. వైరస్ ఇప్పుడిప్పుడే కనుమరుగయ్యే పరిస్థితి కనిపించటం లేదు. అందువల్ల వైరస్ భారీన పడకుండా ఉండాలంటే భౌతిక దూరం, వ్యక్తిగత శుభ్రత పాటించడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తీసుకోవాలని వైద్యులు సూచనలు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments