Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా మహమ్మారి.. 24గంటల్లో 1823 కేసులు.. 20 రోజుల పసికందుకు కరోనా

Webdunia
గురువారం, 30 ఏప్రియల్ 2020 (18:39 IST)
భారత్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గత 24గంటల్లో కొత్తగా మరో 1823 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కోవిడ్-19 పాజిటివ్ కేసుల సంఖ్య 33610కి చేరినట్టు తెలిపింది. కాగా కరోనా మహమ్మారి కారణంగా గురువారం మరో 67 మంది ప్రాణాలు కోల్పోవడంతో మృతుల సంఖ్య 1075కు పెరిగింది. 
 
గత 24 గంటల్లో 576 మంది ఈ వ్యాధి నుంచి కోలుకున్నట్టు కేంద్రం తెలిపింది. మొత్తం 33,610 కేసుల్లో ప్రస్తుతం 24,162 యాక్టివ్ కేసులు ఉన్నట్టు వెల్లడించింది. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 8,372గా ఉంది. కాగా అత్యధికంగా మహారాష్ట్ర నుంచి 9,915 మంది కరోనా బారిన పడగా... 432 మంది ప్రాణాలు కోల్పోయినట్టు కేంద్రం తెలిపింది. 
 
అలాగే మహారాష్ట్రలో కరోనా వైరస్‌ విలయ తాండవం చేస్తోంది. చిన్నాపెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరిపై తన ప్రభావాన్ని చూపుతోంది. తాజాగా రాష్ట్రంలో 20 రోజుల చిన్నారికి కరోనా వైరస్‌ సోకింది. థానే జిల్లాలోని కల్యాణ్‌ టౌన్‌కు చెందిన 20 రోజుల శిశువు కరోనా వైరస్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు జిల్లా వైద్యాధికారులు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments