Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహారాష్ట్రలో 12మంది పోలీసులకు కరోనా.. ముంబైలో 144 సెక్షన్

Webdunia
మంగళవారం, 5 మే 2020 (09:48 IST)
మహారాష్ట్రలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ప్రజలు కరోనా భయంతో వణికిపోతున్నారు. దేశంలో నమోదవుతున్న కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలోనే వెలుగుచూస్తున్నాయి. అంతేకాకుండా పోలీస్ శాఖలోనూ కేసుల తీవ్రత పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా జెజె మార్గ్ పోలిస్ స్టేషన్‌కు చెందిన 12మంది పోలీసులకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అవడంతో సంచలనంగా మారింది. వీరిలో ఆరుగురు సబ్ ఇన్‌స్పెక్టర్లు కూడా ఉన్నారు.
 
అయితే వీరిలో 8 మందిలో కరోనా లక్షణాలు బయటపడలేవని, పరీక్షల్లో పాజిటివ్ అని నిర్ధారణ అయినట్లు తెలిపారు. దీంతో వీరి కుటుంబ సభ్యులు సహా, 40 మందిని సెల్ఫ్ క్వారంటైన్‌కు పంపినట్లు పోలీస్ ఉన్నతాధికారులు వెల్లడించారు. జెజె హాస్పిటల్ పక్కనే జెజె మార్గ్ పోలీస్ స్టేషన్ కూడా ఉండటంతో ఇంకా వైరస్ ఎవరెవరికి సోకిందనే విషయం తెలియాల్సి ఉంది.
 
మరోవైపు ముంబై నగరంలో సోమవారం ఒక్క రోజే కొత్తగా 510 పాజిటివ్ కేసులు నమోదైన విషయం తెలిసిందే. మొత్తం 18 మంది మృతి చెందారు. ఈ కేసులతో ముంబైలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 9123కు చేరుకుంది. ముంబైలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు పోలీసులు 144 సెక్షన్‌ను విధించారు. మే 17 వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments