Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లైన మరుసటి రోజే కోవిడ్‌తో వరుడి మృతి.. పెళ్లికి హాజరైన 31మందికి కరోనా

Webdunia
గురువారం, 25 జూన్ 2020 (17:48 IST)
వివాహమైన మరుసటి రోజే బీహార్‌లో వరుడు ప్రాణాలు కోల్పోయాడు. కరోనా కారణంగా వరుడు మృతి చెందడంతో పెళ్లికి హాజరైన 31మందికి కరోనా సోకిందని వైద్యులు నిర్ధారించారు. వివరాల్లోకి వెళితే.. పాట్నా జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన వరుడు.. హర్యానా, గుర్గావ్‌లో పనిచేస్తున్నాడు. గత జూన్ 15వ తేదీ వివాహం కోసం గుర్గావ్ నుంచి నవుబద్భూర్ ప్రాంతానికి చేరుకున్నాడు. 
 
వివాహం కూడా ముగిసింది. వివాహం జరిగిన మరుసటి రోజు వరుడు అనారోగ్యం కారణంగా పాట్నాలోని ఆస్పత్రిలో చేరాడు. అయితే అతనికి ఆరోగ్య పరిస్థితి విషమంగా వున్న కారణంగా ప్రాణాలు కోల్పోయాడు. వరుడి మృతిపై జరిపిన విచారణ జరిగింది. 
 
ఇంకా టెస్టుల్లో వరుడికి కరోనా సోకిందని తెలిసింది. ఈ క్రమంలో ఆ గ్రామ ప్రజల్లో 125మందికి కరోనా టెస్టు చేయించారు. వీరిలో 31మందికి కరోనా పాజిటివ్ అని తేలడంతో గ్రామస్థులు షాక్ అయ్యారు. ఫలితంగా ఆ ప్రాంతాన్ని కంటోన్మెంట్‌ జోన్‌గా ప్రకటించారు. ఆ గ్రామ వాసులను ఇళ్లల్లోనే నిర్భంధించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డబ్బుల కోసం సినిమాలు చేయాలని లేదు, కన్నప్ప లో ప్రభాస్, విష్ణు పాత్రలు హైలైట్ : శివ బాలాజీ

ఎంటర్టైన్మెంట్, లవ్ స్టోరీ వర్జిన్ బాయ్స్ కి సెన్సార్ నుండి ఏ సర్టిఫికెట్

శ్రీశైలం దర్శనంతో ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ముగించిన మంచు విష్ణు

Kannappa first review : మంచు విష్ణు చిత్రం కన్నప్ప ఫస్ట్ రివ్యూ చెప్పేసిన నటుడు

వర్జిన్ బాయ్స్ ట్రైలర్ లోనే అడల్ట్ కంటెంట్ - దానిని టీనేజర్స్ తో పబ్లిసిటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

ఓరల్ యాంటీ-డయాబెటిక్ మందులను పంపిణీకి అబాట్- ఎంఎస్‌డి వ్యూహాత్మక భాగస్వామ్యం

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

తర్వాతి కథనం
Show comments