Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కరోనా పేరుతో పరీక్షా కిట్ల కుంభకోణం : చంద్రబాబు ఆరోపణ

కరోనా పేరుతో పరీక్షా కిట్ల కుంభకోణం : చంద్రబాబు ఆరోపణ
, బుధవారం, 24 జూన్ 2020 (20:20 IST)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మరోమారు ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. కరోనా పేరుతో పరీక్షా కిట్ల కుంభకోణానికి పాల్పడ్డారంటూ ఆరోపణలు చేశారు. ఇదే అంశంపై ఆయన బుధవారం సాయంత్రం వరుస ట్వీట్లు చేశారు. 
 
"ఏపీలో కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. అయితే అంతకన్నా ఆందోళనకర విషయం ఏమంటే... కరోనా పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం... ప్రజారోగ్యంతో ఆటలాడటం. కరోనా పేరుతో పరీక్షా కిట్ల కుంభకోణం, బ్లీచింగ్ పౌడర్ స్కామ్ లు చూసాం". 
 
"రోజుకు వేల పరీక్షలు చేస్తున్నామని ప్రచారం చేసుకుంటే సరా? అందులో ఖచ్చితత్వం ఇదేనా? నెగటివ్ ఉన్న వ్యక్తికి పాజిటివ్ అని ఎలా చెబుతారు? ప్రజల ఆరోగ్యంతో కూడా ఇలాగే ఆడుకుంటున్నారా? పాజిటివ్ అని నిర్ధారణ కాకముందే ఒక ఎమ్మెల్సీని క్వారంటైన్‌లో ఎందుకు పెట్టాలనుకున్నారు?"
 
"కరోనా పాజిటివ్ అన్న పేరుతో దీపక్ రెడ్డిని క్వారంటైన్‌లో ఉంచాలనుకోవడం వెనుక రాజకీయ దురుద్ధేశాలు ఏమైనా ఉన్నాయా అన్నది కూడా అనుమానంగా ఉంది. అంతకన్నా ముందు కరోనా పరీక్షల ఖచ్చితత్వం ఏంటన్నది ప్రభుత్వం సమాధానం చెప్పాలి".

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శాంసంగ్ యూజర్లకు గుడ్ న్యూస్.. గెలాక్సీ ఏ80పై రూ.30వేల తగ్గింపు