Webdunia - Bharat's app for daily news and videos

Install App

30 రోజుల్లో ఒక వ్యక్తి నుంచి 406 మందికి కరోనా

Webdunia
ఆదివారం, 28 మార్చి 2021 (19:51 IST)
దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో 12 రాష్ట్రాల అధికారులు, కలెక్టర్లు, మున్సిపల్‌ కమిషనర్లతో కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కరోనా నిబంధనల విషయంలో కఠినంగా వ్యవహరించాలని రాష్ట్రాలకు సూచించారు.

మాస్కులు, సామాజిక దూరం లాంటి కరోనా నిబంధనలు పాటించకపోతే.. కరోనా సోకిన ఒక వ్యకి 30 రోజుల్లో సగటున 406 మందికి వైరస్‌ను అంటించే అవకాశం ఉందని హెచ్చరించారు. మహారాష్ట్రలో 25 జిల్లాలు తీవ్ర కరోనా ప్రభావానికి లోనయ్యాయని, దేశంలోని 59.8 శాతం కేసులు ఈ జిల్లాల నుంచే వస్తున్నాయని ఆరోగ్యశాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు.

90 శాతం మరణాలు.. 45 ఏళ్లకు పైగా వయసున్న వారిలోనే సంభవిస్తున్నాయని, వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలని రాజేశ్‌ భూషణ్‌ సూచించారు. మాస్కులపై 90 శాతం ప్రజలకు అవగాహన ఉన్నా 44 శాతం మందే ధరిస్తున్నారని, అందుకే నిబంధనలు ఉల్లంఘించిన వారికి భారీ జరిమానాలు విధించాలని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments