Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్నాటకలో టిప్పు సుల్తాన్ పై కరోనా ప్రభావం!

Webdunia
బుధవారం, 29 జులై 2020 (09:20 IST)
కరోనా దెబ్బ కర్ణాటకలో 18వ శతాబ్దానికి చెందిన మైసూర్‌ పాలకుడు టిప్పుసుల్తాన్‌ పైనా పడింది.  అక్కడి బీజేపీ ప్రభుత్వం ఏడవ తరగతి సాంఘీక శాస్త్రం నుండి టిప్పు సుల్తాన్‌ చాప్టర్‌ను తొలగించింది.

కరోనా మహమ్మారి కారణంగా 2020-21 విద్యా సంవత్సరంలో పాఠశాలలు 120 రోజులు మాత్రమే పనిచేస్తాయని, దీంతో సిలబస్‌ను తగ్గించనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. 

కర్ణాటక టెక్ట్స్‌ బుక్‌ సొసైటీ (కెటిబిఎస్‌) వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసిన ఏడవ తరగతి సవరించిన సిలబస్‌ ప్రకారం.. సోషల్‌ టెక్ట్‌ బుక్‌లో హైదర్‌ అలీ, టిప్పుసుల్తాన్‌ల హయాంలో నిర్మించిన మైసూర్‌ చారిత్రక స్థలాలు, పరిపాలన తీరు అనే అధ్యాయాన్ని తొలగిస్తున్నట్లు ప్రజా సమాచార శాఖ ప్రతినిధులు తెలిపారు.

కాగా, ఈ నిర్ణయంపై కర్ణాటక కాంగ్రెస్‌ అధ్యక్షుడు డి.శివకుమార్‌ మండిపడ్డారు. ఉద్దేశపూర్వకంగానే బీజేపీ ఇటువంటి నిర్ణయం తీసుకుందని తెలిపారు.

చరిత్రలో జరిగిన దానిని మనం మార్చలేమని, టిప్పుసుల్తాన్‌ చారిత్రక వ్యక్తి అని, ఈ అధ్యాయాన్ని తొలగించడాన్ని తాము అంగీకరించలేమని, దీనిపై ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే బీజేపీ ప్రభుత్వం టిప్పు సుల్తాన్‌ జయంతి వేడుకలను రద్దు చేసిన విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

Devara 2 : ఎన్.టి.ఆర్. దేవర సీక్వెల్ వుండదా?

విశ్వంభర లో కొత్తతరం హాస్యనటులతో మెగాస్టార్ చిరంజీవి

శ్రీ విష్ణు, కేతిక శర్మ, ఇవానా నటించిన #సింగిల్ ఫస్ట్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments