Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా ఎఫెక్ట్.. రేపు రైల్వేకు బ్రేక్

Webdunia
శనివారం, 21 మార్చి 2020 (16:58 IST)
దేశంలో విజృంభిస్తోన్న కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు తలపెట్టిన జనతా కర్ఫ్యూ రోజున రవాణా వ్యవస్థ నిలిచిపోనుంది. కర్ఫ్యూలో భాగంగా పాసింజర్ రైళ్లతో పాటు పలు నగరాల్లో బస్సు, మెట్రో సేవలు కూడా రద్దు కానున్నాయి.

కరోనా వ్యాప్తిని నిలువరించేందుకు ఆదివారం చేపట్టనున్న జనతా కర్ఫ్యూలో భాగంగా రైళ్లు నిలిచిపోనున్నాయి. ఏ పాసింజర్‌ రైలు కూడా శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం రాత్రి 10 గంటల వరకు బయల్దేరబోదని రైల్వేశాఖ స్పష్టంచేసింది. ఫలితంగా సుమారు 2,400 సర్వీసులు రద్దు కానున్నాయి. అప్పటికే ప్రయాణంలో ఉన్న రైళ్లు మాత్రం గమ్యస్థానం చేరే వరకు అనుమతిస్తారు.

దిల్లీ, ముంబయి, కోల్‌కతా, సికింద్రాబాద్‌ సబర్బన్‌ రైలు సర్వీసులు పరిమితంగానే సేవలు అందించనున్నాయి.  కాగా ఆదివారం చెన్నై నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే 64 ఎక్స్ప్రెస్ రైళ్లు, చెన్నై మీదుగా వెళ్లే రైళ్లను సైతం రద్దు చేసినట్లు దక్షిణ రైల్వే ప్రకటించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వాళ్లు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తారు... మేము ఎడ్యుకేట్ చేస్తాం : ఏఆర్ మురుగదాస్

రీ రిలీజ్‌కు సిద్దమైన 'స్టాలిన్' మూవీ

పవన్ కళ్యాణ్ ఓ పొలిటికల్ తుఫాను : రజనీకాంత్

వీధి కుక్కలను చంపవద్దు అంటే ఎలా? దత్తత తీసుకోండి.. హ్యాష్ ట్యాగ్ సృష్టించండి.. వర్మ (video)

డేటింగ్ యాప్‌లపై కంగనా రనౌత్ ఫైర్.. అదో తెలివి తక్కువ పని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments