Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాతో భర్త మృతి.. చితికి నిప్పంటించిన భార్య

Webdunia
శనివారం, 25 ఏప్రియల్ 2020 (13:29 IST)
కరోనా బాధితుడు ప్రాణాలు కోల్పోయాడు. లాక్ డౌన్ కారణంగా.. బంధువులు ఎవ్వరూ రాలేకపోయారు. చివరికి కట్టుకున్న భార్యే చితికి నిప్పు అంటించింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని రైసన్ జిల్లాలో కరోనా సోకిన భర్త మృతిచెందడంతో భార్య అతని చితికి నిప్పు పెట్టింది. కరోనా బాధితుడు అమిత్ అగర్వాల్ భోపాల్ లోని హమీడియాలోని ఆసుపత్రిలో మృతి చెందాడు. 
 
టిఫిన్ సెంటర్‌ నడుపుతున్న ఇతడి ఆరోగ్యం విషమించడంతో ఆస్పత్రిలోనే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడి భార్య వర్ష సహకారి బ్యాంకులో పనిచేస్తోంది. తన భర్త మరణం గురించి సమాచారం అందుకున్న ఆమె భర్తకు తానే అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించుకుంది. 
 
కరోనా అనుమానంతో అమిత్ సోదరుడు కూడా హమిడియా ఆసుపత్రిలో చేరాడు. మృతుని పిల్లలు ఇద్దరూ రాజధాని భోపాల్‌లో ఉన్నారు. మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లడానికి వర్ష అనుమతి కోరింది. అయితే అధికారులు అందుకు అనుమతి నిరాకరించారు. దీనితో వర్ష స్వయంగా భర్తకు సామాజిక దూరం పాటిస్తూ అంత్యక్రియలు నిర్వహించింది. భర్త చితికి ఆమే నిప్పంటించి అంత్యక్రియలు పూర్తి చేసింది.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments