Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నిన్న కర్నూలు.. నేడు కృష్ణా - ఏపీలో వెయ్యి దాటిన పాజిటివ్ కేసులు

Advertiesment
Corona Positive Cases
, శనివారం, 25 ఏప్రియల్ 2020 (12:27 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయి. దీంతో కేంద్రం కూడా దృష్టి కేంద్రీకరించింది. ఇదే విషయంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ చేసి ఆరా తీసినట్టు సమాచారం. ఈ పరిస్థితుల్లో ఏపీలో శనివారం కొత్తగా మరో 61 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 
 
శనివారం ఉదయం 10 గంటలకు ఏపీ కరోనా కమాండ్ కంట్రోల్ రూమ్ విడుదల చేసిన బులెటిన్ 135 ప్రకారం... 61 కొత్త కేసులు నమోదు కాగా.. పాజిటివ్ కేసుల సంఖ్య 1,016కు చేరింది. ఇప్పటివరకు 171 మంది డిశ్చార్జ్ కాగా.. 31 మంది మృతిచెందారు.. ప్రస్తుతం ఆస్పత్రుల్లో 814 మంది చికిత్స పొందుతున్నారు. ఇక, 24 గంటల్లో ఇద్దరు మృతిచెందారు.  
 
గత 24 గంటల్లో అత్యధికంగా కృష్ణా జిల్లాలో కొత్తగా 25 కరోనా కేసులు నమోదుకాగా, ఆ తర్వాత కర్నూలులో 14 నమోదు కాగా... అనంతపురంలో 5, తూర్పు గోదావరిలో 3, గుంటూరులో 3, కడపలో 4, నెల్లూరులో 4, శ్రీకాకుళం 3 కేసులు నమోదు అయ్యాయి. 
 
గత 24 గంటల్లో 6,928 శాంపిల్స్‌ను పరీక్షించగా 61 పాజిటివ్‌గా వచ్చాయి. ఇక, కర్నూలులో ఒకరు, కృష్ణా జిల్లాలో ఒకరు మృతిచెందగా.. మృతుల సంఖ్య 31కి చేరింది. 13 జిల్లాల్లో అత్యధికంగా ఒక్క కర్నూలులోనే 259 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత గుంటూరులో 209, కృష్ణా జిల్లాలో 127 కేసులు నమోదు అయ్యాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దాతలు కూడా సామాజిక దూరాన్ని పాటించాల్సిందే : ఏపీ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి