Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు

Webdunia
గురువారం, 14 అక్టోబరు 2021 (16:27 IST)
దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. రోజువారీ కేసులు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా 18 వేలకు పైగా కేసులు, 200కు పైగా మరణాలు సంభవించాయి. గురువారం కేంద్ర ఆరోగ్యశాఖ ఈ గణాంకాలను వెల్లడించింది.
 
బుధవారం 13,01,083 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 18,987 మందికి పాజిటివ్‌గా తేలింది. అంతక్రితం రోజుతో పోల్చితే కేసుల్లో 16 శాతం పెరుగుదల కనిపించింది. నిన్న 19,808 మంది కరోనా నుంచి కోలుకున్నాను. ఇప్పటి వరకు 3.40 కోట్ల మందికిపైగా వైరస్ సోకగా.. వారిలో 3.33 కోట్ల మంది కోలుకున్నారు. రికవరీ రేటు 98.07 శాతానికి చేరింది.
 
ప్రస్తుతం క్రియాశీల కేసులు రెండు లక్షలకు చేరువలో కొనసాగుతున్నాయి. ఆ కేసుల సంఖ్య 2.06 లక్షలు(0.61 శాతం)గా ఉంది. నిన్న మరో 246 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా 4,51,435 మంది మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు.
 
బుధవారం టీకా డోసుల పంపిణీలో కాస్త తగ్గుదల కనిపించింది. నిన్న 35.66 లక్షల మంది టీకా వేయించుకున్నారు. ఇప్పటి వరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య 96.82 కోట్లకు చేరింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

#TheyCallHimOG - షూటింగ్‌లతో పవన్ బిజీ బిజీ

రెండు భాగాలుగా మహేశ్ బాబు - రాజమౌళి యాక్షన్ అడ్వెంచర్ మూవీ?

తమన్నా భాటియాకు కష్టాలు- ఐదు గంటల పాటు ఈడీ విచారణ.. ఎందుకు? (video)

రాధికా ఆప్టే బేబీ బంప్ ఫోటోలు వైరల్

80 కిలోలు ఎత్తిన రకుల్ ప్రీత్ సింగ్, వెన్నెముకకు గాయం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే అల్లం నీటిని తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

వరల్డ్ ట్రామా డే : ట్రామా అంటే ఏమిటి? చరిత్ర - ప్రాముఖ్యత

మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఏ సమస్యకు ఎలాంటి టీ తాగితే ప్రయోజనం?

గుంటూరు లోని ఒమేగా హాస్పిటల్‌లో నూతన కొలొస్టమి కేర్ క్లినిక్, పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments