Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహారాష్ట్రలో 101కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు.. తలుపులకు స్టిక్కర్లు

Webdunia
మంగళవారం, 24 మార్చి 2020 (14:02 IST)
కరోనా ధాటికి మహారాష్ట్రలో పాజిటివ్ కేసులు 101కి చేరాయి. దీంతో, ఆ రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని కఠిన చర్యలు తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. అలాగే తెలంగాణలో మరో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 36కి చేరింది. 
 
కరోనా నేపథ్యంలో దాదాపు అన్ని రాష్ట్రాలు లాక్ డౌన్‌ విధించాయి. తాజాగా ఒడిశా సైతం లాక్‌డౌన్ ప్రకటించింది. మార్చి 24 నుంచి 29 వరకు ఈ లాక్‌డౌన్ అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. ఒడిశా సర్కారు ఇటీవల ఐదు జిల్లాల్లో లాక్‌డౌన్ విధించింది. అయితే దేశంలో కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో.. లాక్‌డౌన్ ను ఐదు జిల్లాల నుంచి 14 జిల్లాలకు విస్తరిస్తున్నట్లు సోమవారం ఉదయం ప్రకటించింది. 
అయితే ఇప్పటికే అన్ని రాష్ట్రాలు పూర్తిస్థాయి లాక్‌డౌన్ విధించడాన్ని గమనించిన నవీన్ పట్నాయక్ సర్కారు.. మంగళవారం నుంచి ఒడిశాలో సైతం పూర్తిస్థాయిగా మొత్తం 30 జిల్లాల్లో లాక్‌డౌన్ విధించింది. అదేవిధంగా ఎవరైతే కరోనా అనుమానితులుగా హోమ్ క్వారైంటైన్‌లో ఉన్నారో వారి ఇంటి తలుపులకు స్టిక్కర్లు వేయాలని కూడా ఒడిశా ప్రభుత్వం నిర్ణయించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కేన్సర్ సోకి రూపురేఖలే మారిపోయిన కేజీఎఫ్ నటుడు

మంచి విషయం గురించి చెప్పినా విమర్శలు తప్పట్లేదు : హీరో నాని

'ఫ్లూటు జింక ముందు ఊదు.. సింహం ముందు కాదు'... రజనీకాంత్

సినీ నిర్మాణ కార్మికులకు వేతనాలు పెంచిన తెలుగు ఫిల్మ్ చాంబర్

Balakrishna: బాలకృష్ణకు సత్కారం.. సీఎం సహాయ నిధికి రూ.50 లక్షల విరాళం- ప్రముఖుల కితాబు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments