Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో కరోనా ఉధృతి

Webdunia
మంగళవారం, 30 మార్చి 2021 (10:16 IST)
దేశంలో కరోనా ఉధృతి రోజురోజుకీ తీవ్రమౌతోంది. తాజాగా ఆదివారం నుండి సోమవారం వరకు 24 గంటల వ్యవధిలో దేశ వ్మాప్తంగా 68,028 మందికి వైరస్‌ సోకగా, 291 మంది మరణించారు. తాజాగా వైరస్‌బారిన పడిన వారిలో ఒక్క మహారాష్ట్ర నండే 40,414 మంది ఉన్నారు.

తాజా సమాచారంతో దేశంలో మొత్తం కరోనా సోకిన వారి సంఖ్య 1,20,39,644కు, మర ణాల సంఖ్య 1,61,843కు చేరింది. ఈ మేరకు కేంద్ర వ్యైద్య ఆరోగ్యశాఖ సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది.

గడిచిన 24 గంటల్లో కోవిడ్‌ బారి నుంచి 32,231 మంది బాధితులు కోలుకున్నారని, దేశ వ్యాప్తంగా రికవరీల సంఖ్య 1,13,55,993 కి చేరిందని తెలిపింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 5,21,808 మంది కరోనాతో చికిత్స పొందుతున్నారు.
 
మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, పంజాబ్‌, మధ్యప్రదేశ్‌ తదితర రాష్ట్రాలో కోవిడ్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. దీంతో ఆయా రాష్ట్రాలలో అప్రమత్తమయిన అధికారులు పలు ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు.

మహరాష్ట్రలో కరోనా కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా పెరు గుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గత 24 గంటల్లో చోటుచేసుకున్న మరణాల్లో 81.73 శాతం మహారాష్ట్రలో చోటుచేసుకున్నాయని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

సంబంధిత వార్తలు

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments