Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అహ్మదాబాద్‌ ఐఐఎంలో కరోనా కలవరం

అహ్మదాబాద్‌ ఐఐఎంలో కరోనా కలవరం
, సోమవారం, 29 మార్చి 2021 (03:46 IST)
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ ఇండియన్‌ ఇన్‌స్ట్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం)లో కరోనా కలకలం రేపుతోంది. ఐఐఎంలో సుమారు 40 మంది విద్యార్థులు, ప్రొఫెసర్లు కరోనా బారిన పడ్డారు.

25 మంది విద్యార్థులకు కోవిడ్‌ సోకినట్లు సమాచారం. ఐఐఎం నిర్వహించిన పరీక్షల్లో 40 మంది కరోనా పాజిటివ్‌ అని తేలిందని, వీరిని ఐసోలేషన్‌ ఉన్నారని అహ్మదాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్లు డిప్యూటీ హెల్త్‌ ఆఫీసర్‌ మెహుల్‌ ఆచార్య తెలిపారు.

చాలా మందికి కరోనా లక్షణాలు లేవని, గత ఏడాది నుండి ఆన్‌లైన్‌లోనే క్లాసులు జరుపుతున్నాయని అన్నారు. క్యాంపస్‌లో కొన్ని షరతులు విధించామని చెప్పారు. అదేవిధంగా ముందు జాగ్రత్త చర్యలను పాటించాలని సూచించినట్లు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పవార్, అమిత్‌షా రహస్య భేటీ?