Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూన్ నాటికి 20 కోట్ల క‌రోనా వ్యాక్సిన్లు రెడీ

Webdunia
బుధవారం, 21 ఏప్రియల్ 2021 (19:28 IST)
వ్యాక్సిన్ల సేక‌ర‌ణ‌ను ప్ర‌భుత్వం స‌ర‌ళీక‌రించ‌డంతో దేశీ వ్యాక్సిన్ త‌యారీదారులు ఉత్ప‌త్తి సామ‌ర్థ్యం పెంచేందుకు స‌న్న‌ద్ధ‌మ‌య్యారు. మే 1 నుంచి 18 ఏండ్లు పైబ‌డిన వారంద‌రికీ వ్యాక్సినేష‌న్ కు కేంద్ర ప్ర‌భుత్వం అనుమ‌తించ‌డంతో వ్యాక్సిన్ త‌యారీని ముమ్మ‌రం చేయాల‌ని ఫార్మా కంపెనీలు క‌స‌ర‌త్తు సాగిస్తున్నాయి.

జూన్ నాటికి దేశంలో 20 కోట్ల క‌రోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి రానుండ‌గా ప్రైవేట్ మార్కెట్ లో ఒక్కో వ్యాక్సిన్ డోసు రూ వేయి వ‌ర‌కూ ప‌ల‌క‌వ‌చ్చ‌ని భావిస్తున్నారు. త‌యారీ ఊపందుకున్న క్ర‌మంలో జూన్ నుంచి వ్యాక్సిన్ స‌ర‌ఫ‌రాలు పెర‌గ‌నున్నాయి.

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ మంగ‌ళ‌వారం వ్యాక్సిన్ త‌యారీదారుల‌తో మాట్లాడుతూ ఉత్ప‌త్తి సామ‌ర్ధ్యం పెంచాల‌ని కోరిన సంగ‌తి తెలిసిందే. జూన్ నుంచి సీరం ఇనిస్టిట్యూట్, భార‌త్ బ‌యోటెక్ ల వ్యాక్సిన్ల స‌ర‌ఫ‌రాల‌తో పాటు స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ల దిగుమ‌తులు ఊపందుకుంటాయ‌ని భావిస్తున్నారు.

మ‌రోవైపు వ్యాక్సిన్ త‌యారీదారుల‌తో ధ‌ర‌ల‌పై సంప్ర‌దింపులు జ‌ర‌పాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం రాష్ట్రాలు, ప్రైవేట్ ఆస్ప‌త్రుల‌ను కోరింది. అంత‌ర్జాతీయ మార్కెట్ లో పోటీకి దీటుగా ఉండేలా ధ‌ర‌లు ఉండాల‌ని వ్యాక్సిన్ త‌యారీదారులు ప్ర‌భుత్వానికి విజ్ఞ‌ప్తి చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను చెప్పింది కరెక్ట్ కాకపోతే నా హిట్ 3ని ఎవరూ చూడొద్దు : నాని

హారర్ చిత్రం రా రాజా ఎలా ఉందంటే.. రా రాజా రివ్యూ

పింటు కి పప్పీ మైత్రి మూవీ మేకర్స్ ద్వారా కిస్ కిస్ కిస్సిక్ గా విడుదల

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ జాక్ నుంచి ఫస్ట్ సింగిల్ పాబ్లో నెరుడా రిలీజ్

మైండ్ స్పేస్ ఎకో రన్ లో ఆకట్టుకున్న సంతాన ప్రాప్తిరస్తు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సన్ ఫ్లవర్ ఆయిల్ మంచిదా చెడ్డదా?

పులి త్రేన్పులు వస్తున్నాయా? జీలకర్ర నీరు తాగి చూడండి

ప్రతిరోజూ పసుపు, జీలకర్ర నీటిని తీసుకుంటే..? మహిళల్లో ఆ సమస్యలు మాయం

నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు

మహిళలు బెల్లం ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments