Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుదుచ్చేరిలో పూర్తిస్థాయి లాక్డౌన్.. ఈ నెల 23 నుంచి 26 వరకు..?

Webdunia
బుధవారం, 21 ఏప్రియల్ 2021 (18:40 IST)
కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో శుక్రవారం రాత్రి నుంచి సోమవారం వరకు పూర్తిస్థాయి లాక్‌డౌన్ అమలు చేయనున్నట్టు అధికారులు ప్రకటించారు. దేశవ్యాప్తంగా కొవిడ్-19 కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. ఈ నెల 23 రాత్రి 10 గంటల నుంచి 26 ఉదయం 5 గంటల వరకు లాక్‌డౌన్ అమలు కానుంది. 
 
పుదుచ్చేరిలో రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తూ నిర్ణయం తీసుకున్న మరుసటి రోజే లాక్‌డౌన్ ఆదేశాలు వెలువడడం గమనార్హం. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ విధిస్తున్నట్టు నిన్న పుదుచ్చేరి అధికార యంత్రాంగం ప్రకటించింది. ఈ ఉత్తర్వుల ప్రకారం.. రాత్రి 10 గంటలకల్లా ఇళ్లకు చేరుకునే విధంగా దుకాణదారులు తమ సమయాలను మార్పు చేసుకోవాల్సి ఉంటుంది. 
 
హోటళ్లలో డైనింగ్ సర్వీసులు రాత్రి 8 గంటల కల్లా ముగించాలనీ.. హోం డెలివరీని 10 గంటల కల్లా పూర్తిచేయాలని అధికారులు ఆదేశించారు. కాగా పుదుచ్చేరిలో నిన్న కొత్తగా 4,692 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

Breakfast: స్కూల్స్‌కు వెళ్లే పిల్లలు బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోతే.. ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments