Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హైదరాబాద్ శివార్లలో భారీగా కేసులు.. వందమంది పైగా పాజిటివ్, లాక్డౌన్

హైదరాబాద్ శివార్లలో భారీగా కేసులు.. వందమంది పైగా పాజిటివ్, లాక్డౌన్
, మంగళవారం, 20 ఏప్రియల్ 2021 (15:49 IST)
తెలంగాణలో కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. అలాగే హైదరాబాద్ శివార్లలో సైతం కోవిడ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. శంషాబాద్ మున్సిపాలిటీలో కరోనా కలకలం రేపింది. గొల్లపల్లిలో ఏకంగా వంద మందికి పైగా కరోనా బారిన పడ్డారు. వీరిలో ముగ్గురు మృతి చెందారు. ఇటీవల వ్యవసాయ శాఖ నిర్వహించిన రైతు సదస్సులో వీరంతా పాల్గొనడం ద్వారా వీరికి కోవిడ్ సోకిందని స్థానికులు అంటున్నారు. 
 
గొల్లపల్లి గ్రామంలో పరీక్షలు నిర్వహించగా వంద మందికి కోవిడ్ నిర్ధారణ అయ్యింది. మరోవైపు గొల్లపల్లితో పాటు శంషాబాద్‌లోని వివిధ గ్రామాల్లో పదుల సంఖ్యలో కరోనా కేసులు నమోదు కావడం ఆందోళనకు గురిచేస్తోంది. 
 
ఇప్పటికే చిన్న గోల్కొండ ప్రభుత్వ పాఠశాలలోని పలువురు విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. పాలమాకుల పాఠశాలలోనూ ఇరవై మందికి పైగా వైరస్ బారిన పడ్డారు. అయితే వంద మందికి కరోనా కేసులు నమోదు కావడంతో.. గొల్లపల్లి గ్రామస్థులు స్వచ్ఛంధంగా లాక్‌డౌన్ విధించుకున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి కరోనా పాజిటివ్