Webdunia - Bharat's app for daily news and videos

Install App

యువరాజు కంటే కాంగ్రెస్ పార్టీకి తక్కువ సీట్లు : ప్రధాని మోడీ ఎద్దేవా

ఠాగూర్
ఆదివారం, 12 మే 2024 (16:52 IST)
ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చే సీట్ల సంఖ్యపై ప్రధాని నరేంద్ర మోడీ జోస్యం చెప్పారు. ఈ దఫా కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ యువరాజు వయసు కంటే తక్కువ సీట్లు వస్తాయంటూ ఎద్దేవా చేశారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ ఓట్‌ బ్యాంక్‌ రాజకీయాలు చేస్తోందని ఆయన ఆరోపించారు. సందేశ్‌ఖాలీలో హింసకు గురైన మహిళలను ఆ పార్టీ గూండాలు బెదిరిస్తున్నారన్నారు. 
 
లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా, పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ, ఉత్తర 24 పరగణాల జిల్లాల్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో ప్రధాని ప్రసంగించారు. ఈ సారి కాంగ్రెస్‌కు యువరాజు (రాహుల్‌) వయసు కంటే తక్కువ సీట్లు వస్తాయని ఎద్దేవా చేశారు. ఆ పార్టీ చరిత్రలో ఎన్నడూ చూడనన్ని తక్కువ స్థానాల్లో విజయం సాధించనుందని పేర్కొన్నారు. టీఎంసీ మరోసారి విజయం సాధించే అవకాశమే లేదని మోడీ అన్నారు. కాంగ్రెస్‌-లెఫ్ట్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థితిలో లేవని చెప్పారు. రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వం ఎన్‌డీఏతోనే సాధ్యమన్నారు.
 
ఇక ఉత్తర 24 పరగణ జిల్లాలో జరిగిన ర్యాలీలో ప్రధాని మాట్లాడుతూ టీఎంసీ సర్కారు మన అక్కాచెల్లెళ్లకు ఏం చేసిందో ప్రజలంతా చూశారని విమర్శించారు. ఇప్పుడు సందేశ్‌ఖాలీ బాధితులను టీఎంసీ గూండాలు షాజహాన్‌ షేక్‌ పేరు చెప్పి బెదిరిస్తున్నారన్నారు. నిందితులను కాపాడటానికి ఆ పార్టీ అన్ని ప్రయత్నాలు చేస్తోందన్నారు. ఆ పార్టీ పాలనలో బెంగాల్‌ పూర్తి అవినీతి రాష్ట్రంగా మారిపోయిందన్నారు. రాష్ట్రం నేరగాళ్లతో బాంబుల తయారీ కేంద్రమైందని మండిపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments