Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆర్టీసీ బస్సు ఎక్కిన రాహుల్ గాంధీ.. ప్రయాణీకులతో ముచ్చట్లు

Rahul Gandhi

సెల్వి

, శుక్రవారం, 10 మే 2024 (07:51 IST)
Rahul Gandhi
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ గురువారం రాత్రి బహిరంగ సభలో ప్రసంగించిన తర్వాత గ్రేటర్ హైదరాబాద్‌లోని రాష్ట్ర రోడ్డు మార్గాల బస్సులో ప్రయాణించి అందరనీ ఆశ్చర్యపరిచారు. తోటి  ప్రయాణికులతో మాట్లాడారు. 
 
మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గంలోని సరూర్‌నగర్‌లో బహిరంగ సభ ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డితో కలిసి కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్‌టీసీ) బస్సు ఎక్కారు.
 
రాహుల్ గాంధీ ‘పంచ న్యాయ్’ బ్రోచర్లను ప్రయాణికులకు పంచి, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణ పథకంపై ఆరా తీశారు.  ప్రయాణీకులతో ముచ్చటించిన రాహుల్ గాంధీ మహిళలు, యువత, రైతులు, కార్మికులు వంటి వివిధ వర్గాల కోసం కాంగ్రెస్ తన జాతీయ మేనిఫెస్టోలో చేసిన వాగ్దానాలను వారికి వివరించారు.
 
రాహుల్ గాంధీ తమతో పాటు ప్రయాణిస్తున్నట్లు చూసిన ప్రయాణికులు ఆశ్చర్యానికి లోనవగా, పలువురు ఆయనతో సెల్ఫీలు దిగారు. అంతకుముందు, రాహుల్ గాంధీ బహిరంగ సభలో తన ప్రసంగంలో, రాజ్యాంగాన్ని తొలగించడానికి బిజెపి యోచిస్తోందని ఆరోపించారు. దానిని పరిరక్షిస్తానని ప్రతిజ్ఞ చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాశీలో అదిరిన డ్రోన్ ప్రదర్శన.. ఆశ్చర్యపోయిన ప్రజలు