లోక్‌సభ ఎన్నికలు : బీజేపీకి అనూహ్యంగా తగ్గిన సీట్లు... ఓట్లు శాతం మాత్రం పదిలం...

వరుణ్
బుధవారం, 5 జూన్ 2024 (10:11 IST)
లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి అనూహ్యంగా సీట్లు తగ్గాయి. కానీ, ఆ పార్టీ ఓటింగ్ శాతం మాత్రం పదిలంగా ఉంది. నిజానికి ఈ ఎన్నికల్లో బీజేపీ ఒక్కటే 300కు పైగా స్థానాల్లో గెలుస్తుందని, ఎన్డీయే కూటమి ఏకంగా 400కు పైగా స్థానాల్లో గెలుస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వేశాయి. ఈ ఫలితాలను తలకిందులు చేస్తూ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి.
 
ఏపీలో తెలుగుదేశం పార్టీ విజయం సాధించగా కేంద్రంలో బీజేపీకి అనూహ్యంగా సీట్లు తగ్గాయి. ఎన్డీఏ 390 - 400 సీట్లు సాధిస్తుందన్న అంచనాలకు భిన్నంగా ఫలితాలు వచ్చాయి. మెజారిటీ మార్కు కంటే 21 సీట్లు అధికంగా ఎన్డీయే 293 సీట్లు సాధించింది. ఈసారి బీజేపీకి 240 సీట్లు మాత్రమే దక్కాయి. అయితే, గత ఎన్నికలతో పోలిస్తే సీట్ల సంఖ్య తగ్గినా బీజేపీ ఓట్ల శాతంలో మాత్రం పెద్దగా మార్పు కనిపించలేదని ఎన్నికల ఫలితాలు చెబుతున్నాయి. 
 
గత ఎన్నికల్లో కమలం పార్టీకి 37.37 శాతం ఓట్లు రాగా ఈసారి 37.34 శాతం ఓట్లు వచ్చాయి. అయితే, కాంగ్రెస్ సీట్ల పరంగానే కాకుండా ఓట్ల పరంగానూ బాగా పుంజుకుంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 19.49 శాతం ఓట్లు రాగా ఈసారి 22.34 శాతం ఓట్లు సాధించింది. ఇక ఇండియా కూటమికి సుమారు 42 శాతం ఓట్లు రాగా ఎన్డీఏ కూటమి 45 శాతం ఓట్లు సాధించింది. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలో ఎన్డీయే చెప్పుకోదగ్గ స్థాయిలోనే సీట్లు కోల్పోయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments