Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో టెన్షన్.. టెన్షన్ - ఈడీ ముందుకు రాహుల్ గాంధీ

Webdunia
సోమవారం, 13 జూన్ 2022 (12:03 IST)
ఢిల్లీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. నేషనల్ హెరాల్డ్ పత్రిక మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సోమవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారుల ముందుకు వచ్చారు. ఈ కేసులో విచారణ నిమిత్తం తమ ఎదుట హాజరుకావాలంటూ రాహుల్‌తో పాటు ఆయన తల్లి సోనియా గాంధీకి ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ సమన్లు జారీ చేసిన సమయంలో రాహుల్ విదేశాల్లో ఉన్నారు. ఇపుడు స్వదేశానికి తిరిగివచ్చిన ఆయన సోమవారం ఈడీ కార్యాలయానికి వచ్చారు. 
 
ఈ సందర్భంగా నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో జరిగిన ఆర్థిక అవకతవకల వ్యవహారంలో పలు ప్రశ్నలు సంధించనున్నారు. నిజానికి ఈ నెల 2వ తేదీన రాహుల్ ఈడీ అధికారుల ఎదుట హాజరుకావాల్సివుంది. కానీ, విదేశాల్లో ఉన్న కారణంగా హాజరుకాలేకపోయారు. 
 
కాగా, ఇదే కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఈ నెల 23వ తేదీన ఈడీ ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఈ కేసులో ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్ నేత మల్లిఖార్జున ఖర్గేతో పాటు మరో సీనియర్ నేత పవన్ బన్సల్‌ను విచారించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

మేనమామకు మేనల్లుడి అరుదైన బహుమతి... ఏంటది?

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments