Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్ర‌ధాని మోదీపై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేసిన హీరోయిన్ రమ్య

క‌న్న‌డ సినీ న‌టి ర‌మ్య త‌న కామెంట్స్‌తో వార్త‌ల్లో నిలుస్తుండ‌టం తెలిసిందే. ఏ చిన్న అవకాశం దొరికినా ప్రధాని మోదీపై విరుచుకుపడుతుంటారామె. తాజాగా రమ్య మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ఇంత‌కీ ఏమ‌న్నారంటే

Webdunia
సోమవారం, 28 మే 2018 (17:54 IST)
క‌న్న‌డ సినీ న‌టి ర‌మ్య త‌న కామెంట్స్‌తో వార్త‌ల్లో నిలుస్తుండ‌టం తెలిసిందే. ఏ చిన్న అవకాశం దొరికినా ప్రధాని మోదీపై విరుచుకుపడుతుంటారామె. తాజాగా రమ్య మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ఇంత‌కీ ఏమ‌న్నారంటే... పేటీఎం అంటే 'పే టు మోదీ' అని కొత్త భాష్యం చెప్పారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. మోదీకి డబ్బు చెల్లించండి (పే టు మోదీ కరో) అంటూ ట్యాగ్ లైన్ జత చేసింది. 
 
పేటీఎం పేరుతో మీ డబ్బు మోదీ జేబులోకి వెళ్తున్నట్టే... ఆ యాప్ ద్వారా మీ డేటా మొత్తం బీజేపీకి తరలిపోతోంది అంటూ వ్యాఖ్యానించింది. మరోవైపు పేటీఎంతో మోదీకి లింక్ పెట్టి ట్వీట్ చేయడం పట్ల రమ్య పైన బీజేపీ మద్దతుదారులు మండిపడుతున్నారు. 
 
ఓ వ్యక్తి (రాహుల్ గాంధీ) కోసం నౌకరీ, చాకిరీ చేస్తున్న మీ వైఖరిని మార్చుకోండని ఓ నెటిజన్ సలహా ఇచ్చాడు. మన డేటా వాటికన్‌కు తరలిపోవడం కంటే బీజేపీ చేతిలోకి వెళ్లడమే బెటర్ అంటూ మరో నెటిజన్ స్పందించాడు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments