Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాహుల్ గాంధీ మాన‌స్ స‌రోవ‌ర్ యాత్ర - బీజేపికి కాంగ్రెస్ స‌వాల్..!

కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ ప్ర‌స్తుతం కైలాస్ మానస సరోవర్ యాత్రలో ఉన్నారు. ఆయ‌న అక్టోబర్‌లో దుబాయ్ పర్యటించనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే ఏ తేదీన ఆయన వెళ్తారనేది ఇంకా నిర్ణయం కాలేదు. దుబాయ్‌లో 50,000 మంది పట్టే ఒక స్టేడియాన్ని

Webdunia
సోమవారం, 10 సెప్టెంబరు 2018 (10:59 IST)
కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ ప్ర‌స్తుతం కైలాస్ మానస సరోవర్ యాత్రలో ఉన్నారు. ఆయ‌న అక్టోబర్‌లో దుబాయ్ పర్యటించనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే ఏ తేదీన ఆయన వెళ్తారనేది ఇంకా నిర్ణయం కాలేదు. దుబాయ్‌లో 50,000 మంది పట్టే ఒక స్టేడియాన్ని బుక్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. స్టేడియం బుక్ కాగానే రాహుల్ పర్యటన తేదీపై పార్టీ అధికారిక ప్రకటన చేసే అవకాశాలున్నాయ‌ని తెలిసింది.
 
ప్రస్తుతం 12 రోజుల కైలాస్ మానస సరోవర్ యాత్ర పర్యటనలో ఉన్న రాహుల్ అక్కడ్నించి రాగానే మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే... రాహుల్ మానస సరోవర్ యాత్ర గురించి కేంద్రానికి సమాచారం ఇవ్వకపోవడంపై ఇప్పటికే బీజేపీ విమర్శనాస్త్రాలు ఎక్కుబెడుతోంది. 
 
భారతదేశ పౌరుడిగా కాకుండా చైనా అంబాసిడర్‌గా రాహుల్ వ్యవహరిస్తున్నారంటూ ఆరోపణలు గుప్పిస్తోంది. బీజేపీ విమ‌ర్శ‌ల‌కు కాంగ్రెస్ సైతం దీటుగానే స్పందించింది. ఇంత‌కీ ఏమ‌న్న‌దంటే... రాహుల్ మానస్ సరోవర్ యాత్రలో ఎన్ని కిలోమీటర్లు నడిచారో లెక్కలు చెబుతూ మీరెవరైనా అలా చేయగలరా అంటూ బీజేపీకి ప్రతిసవాలు విసిరింది. మ‌రి.. బీజేపీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments