Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో సంపూర్ణ లాక్డౌన్..

Webdunia
ఆదివారం, 16 మే 2021 (09:45 IST)
వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో కూడా కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీంతో క‌రోనా ఉధృతికి అడ్డుకట్ట వేసేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టసాగింది. రాష్ట్రంలో సంపూర్ణ లాక్‌డౌన్ విధించింది. ఆదివారం ఉద‌యం ఆరు గంట‌ల నుంచి ఆంక్ష‌లు అమ‌ల్లోకి వ‌చ్చాయి. ఆంక్ష‌లు ఈ నెల 30వ తేదీ సాయంత్రం ఆరు గంట‌ల వ‌ర‌కు అమ‌లులో ఉంటాయ‌ని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. 
 
సంపూర్ణ లాక్‌డౌన్ సంద‌ర్భంగా ప‌రిశ్ర‌మ‌లు, మెట్రో స‌ర్వీసులు, అంత‌ర్రాష్ట్ర రైళ్లు, బ‌స్సుల‌ను నిలిపివేశారు. అన్నిర‌కాల స‌మావేశాల‌పై నిషేధాజ్ఞ‌లు అమలు చేస్తున్నది. రాష్ట్రంలోని తేయాకు తోట‌ల్లో 50 శాతం కార్మికులు ప‌నిచేసేలా వెసులుబాటు క‌ల్పించింది. 
 
జ‌న‌ప‌నార మిల్లుల్లో 30 శాతం కార్మికులు ప‌నిచేసేందుకు అనుమ‌తించింది. అత్య‌వ‌సర సేవ‌ల‌కు లాక్‌డౌన్ నుంచి మిన‌హాయింపు నిచ్చారు. ప్ర‌జలు త‌మ‌కు అవ‌స‌ర‌మైన వ‌స్తువుల‌ను కొనుక్కునేందుకు ఉద‌యం 7 గంట‌ల నుంచి 10 గంట‌ల వ‌ర‌కు దుకాణాల‌ను తెరిచేందుకు ప్ర‌భుత్వం అనుమ‌తించింది.
 
కాగా, ప‌శ్చిమ‌బెంగాల్‌లో శనివారం 20,846 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో మొత్తం కేసులు 10,94,802కు చేరాయి. ఇందులో 1,31,792 కేసులు యాక్టివ్‌గా ఉండ‌గా, 9,50,017 మంది బాధితులు క‌రోనా నుంచి కోలుకున్నారు. మ‌రో 12,993 మంది మృతిచెందారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Singh: వివాదంలో పవన్ సింగ్.. హీరోయిన్ అంజలి నడుమును తాకాడు (video)

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ పుట్టినరోజు పోస్టర్‌ విడుదల

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments