Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేపు కర్నాటక రాష్ట్ర బంద్ - తమిళనాడుకు కావేరీ జలాలు విడుదలకు వ్యతిరేకంగా...

Webdunia
సోమవారం, 25 సెప్టెంబరు 2023 (15:55 IST)
తమిళనాడు రాష్ట్రానికి కావేరీ నదీ జలాలను విడుదల చేయడానికి వ్యతిరేకంగా కర్నాటక రాష్ట్రంలో మంగళవారం బంద్ పాటించనున్నారు. ఒప్పందం మేరకు తమిళనాడు రాష్ట్రానికి కావేరీ నీటి జలాలను విడుదల చేయాలని కావేరీ జలాల నిర్వహణ మండలి ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలను అమలు చేసేందుకు కర్నాటక  ప్రభుత్వం మొగ్గు చూపుతుంది. దీన్ని వ్యతిరేకిస్తూ కన్నడ అనుకూల సంఘాలు బంద్‌కు పిలుపునిచ్చాయి. 
 
ద కావేరీ వాటర్ మేనేజ్‌మెంట్ అథారిటీ ఇటీవల తమిళనాడు 15 రోజుల పాటు రోజుకు 5 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని ఆదేశించింది. దీంతో నీటి విడుదలపై ఈ నెల 26వ తేదీన నిర్ణయం తీసుకుంటామని కర్నాటక ప్రభుత్వం తెలిపింది. ఈ ఆదేశాలకు వ్యతిరేకంగా కన్నడ అనుకూల సంస్థలు ఈ నెల 26వ తేదీన బంద్‌కు పిలుపునిచ్చాయి. 
 
కర్నాటక ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్నాయి. రేపటి రోజున బెంగుళూరుతో పాటు కర్నాటక వ్యాప్తంగా బంద్ చేపట్టాలనే ప్రతిపాదన కూడా ఉంది. దీనిపై ఆయా సంఘాలు సోమవారం తుది నిర్ణయాన్ని వెల్లడించనున్నాయి. కర్నాటక వాటర్ కన్జర్వేషన్ కమిటీ ప్రెసిడెట్ కురుబుల్ శంత‌కుమారు ఈ బంద్‌కు నాయకత్వం వహిస్తున్నారు. ఈ బంద్‌లో భాగంగా పాఠశాలలు, కాలేజీలు, ఐటీ కంపెనీలు, ఫిల్మ్ చాంబర్‌ కూడా బంద్‌కు మద్దతిచ్చి 26న సెలవు ప్రకటించాలని కోరారు. అదేసమయంలో ఈ బంద్‌కు ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతు ప్రకటించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments