Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిజం మాట్లాడితే "యాంటీ మోడీ" అనేస్తారా? ప్రకాశ్ రాజ్ ప్రశ్న.. కేసు నమోదు

బెంగుళూరులో దారుణ హత్యకు గురైన మహిళా సీనియర్ జర్నలిస్టు గౌరీ లంకేశ్ హత్యపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మౌనం వీడాలంటూ నటుడు ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలపై కర్ణాటకకు చెందిన బీజేపీ నేతలు మండిపడ్డారు.

Webdunia
గురువారం, 5 అక్టోబరు 2017 (12:37 IST)
బెంగుళూరులో దారుణ హత్యకు గురైన మహిళా సీనియర్ జర్నలిస్టు గౌరీ లంకేశ్ హత్యపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మౌనం వీడాలంటూ నటుడు ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలపై కర్ణాటకకు చెందిన బీజేపీ నేతలు మండిపడ్డారు. దీనిపై ప్రకాశ్ రాజ్ మళ్లీ స్పందించారు. దేశ ప్రధానిగా ఆయనంటే గౌరవం ఉంది.. అలా అని అన్నింటికీ ఆయనకు వంతపాడలేను అని అన్నారు. పైగా, తాను నిజం మాట్లాడతానని స్పష్టం చేశారు. 
 
తానెప్పుడైనా, ఎక్కడైనా సరే నిజమే మాట్లాడతానని అన్నారు. ప్రధాని మోడీ విషయంలో కూడా తాను నిజమే మాట్లాడానని ఆయన చెప్పారు. నిజం మాట్లాడినంత మాత్రానికే 'యాంటీ మోడీ' అనేస్తారా? అని ఆయన ప్రశ్నించారు. మోడీ మన దేశ ప్రధాని అని, ఆయనపై తనకు పూర్తి గౌరవం ఉందని ఆయన తెలిపారు. అదే సమయంలో అన్ని విషయాల్లోనూ తాను ఆయనతో ఏకీభవించలేనని చెప్పారు. ఇక తనను దూషించే వారు, విమర్శించేవారిని ఉద్దేశిస్తూ, వారెవరూ తన ఎదురుగా వచ్చి అలా చేయలేరని ఆయన అన్నారు. అంత ధైర్యం వారికి లేదని ఆయన తెలిపారు. 
 
ఇదిలావుండగా, ఇటీవల చెన్నైలో జరిగిన విలేకరుల సమావేశంలో ప్రధాని మోడీని లక్ష్యంగా చేసుకుని ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలపై ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోలో కేసు నమోదైంది. కొందరు బీజేపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

మరో నెలలో ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్ - గెలాక్టస్‌తో యుద్ధానికి సిద్ధం

War 2 : IMAXలో మాత్రమే వార్ 2 విడుదల అవుతుంది

Laya: ఆ తపనతో తిరిగి వచ్చా - ఇండస్ట్రీలో మార్పులు వచ్చాయి - శివాజీతో సినిమా : నటి లయ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

దివ్యాంగ విద్యార్ధుల కోసం నాట్స్ ఉచిత బస్సు, విశాఖలో బస్సును లాంఛనంగా ప్రారంభించిన ఎంపీ భరత్

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments